త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయా..? : కేటీఆర్

KTR | ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయ‌ని ప్ర‌చారం చేసిందేవ‌రు..? అని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవంలో మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ పరోక్షంగా చురకలు అంటించారు.

S

Telangana | Published On Aug 1, 2026, 6.08 pm IST

KTR | ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయా..? : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయ‌ని ప్ర‌చారం చేసిందేవ‌రు..? అని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవంలో మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ పరోక్షంగా చురకలు అంటించారు.

ఫేక్ న్యూస్‌ను సోష‌ల్ మీడియా ద్వారా వ్యాపింప‌జేస్తున్నార‌ని మ‌హేశ‌న్నా అన్నారు.. య‌స్.. మీడియా షుడ్ బీ ఫ్యాక్ట్ చెక్. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయ‌ని ప్ర‌చారం చేశారు. మ‌రి ఇప్పుడు అక్క‌డ ఎవరు ఉంటున్నారు..? ఉన్నాయా 150 బెడ్రూమ్‌లు. బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు..? ఆ ఫేక్ న్యూస్‌ని వ్యాపింప‌జేసిందేవ‌రు..? 84 వేల కోట్లు ఖ‌ర్చు అయిన ప్రాజెక్టుకు ల‌క్ష కోట్ల కుంభ‌కోణం అని ప్ర‌చారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా..? సినిమా యాక్ట‌ర్ల ఫోన్‌లు ట్యాప్ చేశార‌ని ప్ర‌చారం చేశారు.. మీడియాను అడ్డం పెట్టుకుని. నేను విచార‌ణ‌కు వెళ్లిన‌ప్పుడు ఏ యాక్ట‌ర్ ఫోన్ ట్యాప్ అయిందో కొంచెం నంబ‌ర్లు ఇవ్వ‌మ‌ని అడిగాను. ఎవ‌రివి కాలేదు అన్నాడు. ఈ సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితి ఏందంటే.. నిజం గ‌డ‌ప దాటేలోప‌ల అబ‌ద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వ‌చ్చేస్త‌ది. ఇది వాస్త‌వం. ఈ విష‌యంలో అంద‌రం బాధితుల‌మే అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement