Thalapathy Vijay | దళపతి విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్ – తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్
జూలై నెలాఖరున కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దళపతి విజయ్, అతడి కొడుకు జాసన్ సంజయ్ పోటీపడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాసన్ సంజయ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీ సిగ్మా జూలై 31న థియేటర్లలోకి రాబోతుంది. అదే డేట్కు జనానాయగన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jul 3, 2026, 5.35 pm IST
Thalapathy Vijay | తమిళనాడు సీఎం దళపతి విజయ్తో బాక్సాఫీస్ వద్ద అతడి కొడుకు జాసన్ సంజయ్ పోటీపడబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జననాయగన్ సెన్సార్ అడ్డంకుల దాదాపు తొలగిపోయినట్లు సమాచారం. జూలైలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. జూలై 24 లేదా 31లను ఆప్షన్స్గా అనుకుంటున్నారట. త్వరలోనే ఈ రెండింటిలో ఓ డేట్ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
దర్శకుడిగా ఎంట్రీ...
కాగా దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ సిగ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతోన్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ జూలై 31న థియేటర్లలోకి రాబోతుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్చేశారు.
తండ్రీ వర్సెస్ కొడుకు...
సడెన్గా జూలై నెలాఖరు రేసులోకి జననాయగన్ రావడం ఆసక్తికరంగా మారింది. తండ్రీ కొడుకుల బాక్సాఫీస్ పోరులో ఎవరూ విన్నర్గా నిలుస్తారన్నది అభిమానుల్లో ఉత్కంఠను పంచుతోంది. జూలై 31నే జననాయగన్ వస్తే సిగ్మా రిలీజ్ ఉంటుందా? అన్నది అనుమానమే. అదే డేట్ గనక మేకర్స్ ఫైనల్ చేస్తే కొడుకు సినిమాకు కావాలనే విజయ్ పోటీగా వస్తున్నాడంటూ విమర్శలు రావచ్చు. జూలై 24న వచ్చినా కూడా ఆ ఇంపాక్ట్ సిగ్మాపై గట్టిగానే పడొచ్చు. తండ్రి ప్రభంజనాన్ని తట్టుకొని జాసన్ సంజయ్ సినిమా ఎంత వరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందన్నది చూడాల్సిందేనని అంటున్నారు.
అన్ఫాలో...
కాగా విడాకుల వ్యవహారం కారణంగా తండ్రికి దూరంగా ఉంటున్నారు జాసన్ సంజయ్. సోషల్ మీడియాలో దళపతి విజయ్ని అన్ఫాలో చేశాడు. ఇద్దరి మధ్య ప్రస్తుతం సరైన సంబంధాలు లేవు.
యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా సిగ్మా మూవీని తెరకెక్కిస్తోన్నాడు జాసన్ సంజయ్. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కేథరిన్ స్పెషల్ సాంగ్ చేసింది.
భగవంత్ కేసరి రీమేక్..
మరోవైపు జననాయగన్ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మమితా బైజు ఓ కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణ హీరోగా నటించిన తెలుగు మూవీ భగవంత్ కేసరికి రీమేక్గా జననాయగన్ రూపొందుతోంది. జననాయగన్, సిగ్మా రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ అందించాడు. జననాయగన్ తన చివరి సినిమా అని దళపతి విజయ్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Indus Water Treaty | సింధు జలాల ఒప్పందంలో భారత్ వైఖరిలో మార్పులు లేదు.. పాక్కు స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
- ●Rain Alert | మరో 2 గంటల్లో హైదరాబాద్లో మోస్తరు వర్షం.. జర జాగ్రత్త సుమా..!
- ●Telangana Agriculture | తెలంగాణలో 10.20 లక్షల ఎకరాలు తగ్గిన సాగు.. మరి వరి సాగు ఎంతో తెలుసా..?
- ●Vinod Kumar | పిచ్చి పిచ్చి సవాళ్లెందుకు.. ఫస్ట్ మేడిగడ్డకు బయల్దేరండి
- ●IND vs ENG 2nd T20 | నేడు భారత్-ఇంగ్లండ్ రెండో టీ20.. మళ్లీ వానగండం తప్పదా.?
- ●Aadhaar | ఇక ఆధార్లో ఈ-మెయిల్ అప్డేట్ ఇంటి నుంచే.. యూఐడీఏఐ కొత్త సౌకర్యం..

Indus Water Treaty | సింధు జలాల ఒప్పందంలో భారత్ వైఖరిలో మార్పులు లేదు.. పాక్కు స్పష్టం చేసిన విదేశాంగ శాఖ

Rain Alert | మరో 2 గంటల్లో హైదరాబాద్లో మోస్తరు వర్షం.. జర జాగ్రత్త సుమా..!

Telangana Agriculture | తెలంగాణలో 10.20 లక్షల ఎకరాలు తగ్గిన సాగు.. మరి వరి సాగు ఎంతో తెలుసా..?

Vinod Kumar | పిచ్చి పిచ్చి సవాళ్లెందుకు.. ఫస్ట్ మేడిగడ్డకు బయల్దేరండి






