త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు

బాలీవుడ్ నటి ఖుషీ కపూర్ ఫేక్, అసభ్యకర వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఆ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించింది.

J

Entertainment | Published On Aug 12, 2026, 5.16 pm IST

Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు

సంక్షిప్త సారాంశం

బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్‌కు సంబంధించిన అసభ్యకర కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆమె పేరు, ఫోటోలను వాడుకుని అనధికారికంగా విక్రయిస్తున్న వస్తువుల (merchandise) కంటెంట్‌ను కూడా డిలీట్ చేయాలని స్పష్టం చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పేరును దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పిస్తూ 'జాన్ డో' (John Doe) ఆర్డర్‌ను జారీ చేయనున్నట్లు జస్టిస్ జ్యోతి సింగ్ తెలిపారు. ఆమె సోదరి జాన్వీ కపూర్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల 'పర్సనాలిటీ రైట్స్'ను రక్షిస్తూ ఇటీవలే కోర్టు ఇలాంటి తీర్పులే ఇచ్చింది.

Advertisement

Khushi Kapoor | త్రినేత్ర.న్యూస్ : బాలీవుడ్ నటి ఖుషీ కపూర్‌కు (Khushi Kapoor) ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆన్‌లైన్‌లో తన ఐడెంటిటీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆమె చేసిన న్యాయపోరాటానికి బుధవారం కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న అసభ్యకర, పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తక్షణమే తొలగించాలని (takedown) జస్టిస్ జ్యోతి సింగ్ ఆదేశించారు.

ఆ కంటెంట్ కూడా డిలీట్ చేయాల్సిందే

కేవలం వీడియోలకే పరిమితం కాకుండా.. ఖుషీ కపూర్ పేరు, ఫోటోలు, ఆమె వ్యక్తిగత గుర్తింపును ఉపయోగించి అనధికారికంగా అమ్ముతున్న మర్చండైజ్ (merchandise) కంటెంట్‌ను కూడా ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఖుషీ కపూర్ తరఫున 'ఇండియాలా ఎల్‌ఎల్‌పీ' (IndiaLaw LLP) భాగస్వాములు ఆసవ్ రాజన్, అభా షా కోర్టులో వాదనలు వినిపించారు.

'జాన్ డో' ఆర్డర్‌తో రక్షణ

ఖుషీ కపూర్ 'పర్సనాలిటీ రైట్స్' (Personality rights) ను కాపాడేందుకు కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు లేదా సంస్థలు ఆమె గుర్తింపును వాడుకుని కమర్షియల్‌గా లబ్ధి పొందకుండా, ఇంటర్నెట్‌లో ఇబ్బంది పెట్టకుండా ఆమెకు అనుకూలంగా 'జాన్ డో' (John Doe) ఆర్డర్‌ను పాస్ చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ ఆర్డర్ ద్వారా ఆమెకు మరింత చట్టపరమైన రక్షణ లభించనుంది.

జాన్వీ కపూర్ సహా పలువురు స్టార్లకు

విశేషం ఏంటంటే.. ఖుషీ కపూర్ సోదరి, స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) విషయంలోనూ సరిగ్గా ఒక్కరోజు ముందే ఢిల్లీ హైకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. ఇటీవల కాలంలో సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు, వాయిస్, డీప్‌ఫేక్స్ (Deepfakes), ఏఐ (AI) జనరేటెడ్ వీడియోలను వాడుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న న్యాయస్థానాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి.

గతంలో టాలీవుడ్ స్టార్లు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖులతో పాటు.. పలువురు క్రికెటర్లు, జర్నలిస్టుల పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుతూ ఢిల్లీ హైకోర్టు తీర్పులు ఇచ్చింది. పేరు, ప్రతిష్టలు, ప్రైవసీకి భంగం కలిగించేలా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో జరిగే అనధికారిక వ్యాపారాలు, మార్ఫింగ్‌లపై న్యాయస్థానాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.

Advertisement
Advertisement