త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aliganj Fire Accident 11 Dead | లక్నో కోచింగ్ సెంటర్‌ అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది దుర్మరణం

లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం 11 మందిని బలితీసుకుంది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో పలువురు విద్యార్థులు భవనం పైనుంచి దూకేశారు.

J

Crime | Published On Jun 22, 2026, 5.36 pm IST

Aliganj Fire Accident 11 Dead | లక్నో కోచింగ్ సెంటర్‌ అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది దుర్మరణం
Advertisement
  • లక్నో (Lucknow) అలీగంజ్ ప్రాంతంలోని ఓ కమర్షియల్ భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం
  • కోచింగ్ సెంటర్‌లో చిక్కుకుని 11 మంది మృతి
  • ప్రాణభయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేసిన పలువురు స్టూడెంట్స్
  • మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, తగిన సహాయం అందిస్తామని యూపీ సీఎం (UP CM) యోగి ఆదిత్యనాథ్ ప్రకటన

Aliganj Fire Accident 11 Dead | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నోలో (Lucknow) సోమవారం పెను విషాదం చోటుచేసుకుంది. వాయువ్య లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌ (Coaching centre) భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో పలువురు విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశారు.

Image

మంటల్లో చిక్కుకుని..

మూడంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో పెట్ షాప్ (Pet shop), ఇతర దుకాణాలు ఉండగా.. ఫస్ట్ ఫ్లోర్‌లో కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. టాప్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే కిందకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోపల ఉన్న విద్యార్థులు బయటకు రాలేక విలవిలలాడారు. మంటలు దాదాపు గంటకు పైగా చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసిన తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. 11 మృతదేహాలు (Bodies) లభ్యమయ్యాయి.

Image

ప్రాణభయంతో పైనుంచి దూకి..

దట్టమైన పొగ, మంటల వేడికి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ అద్దాలు పగలగొట్టుకుని కిందకు దూకేశారు. ఓ యువకుడు కిటికీలోంచి బయటకు వచ్చి పట్టు తప్పి కింద ఉన్న ఫెన్సింగ్ పై పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతనికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. పైనుంచి దూకిన వారిలో ఐదు నుంచి ఏడుగురు విద్యార్థులకు ఎముకలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Image

సహాయక చర్యల ముమ్మరం (Rescue Operations)

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ రెస్క్యూ టీమ్స్ (Fire rescue teams) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్వయంగా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. భవనంలో ఇంకా ఎంత మంది చిక్కుకున్నారు అనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు.

Image

సీఎం యోగి దిగ్భ్రాంతి

ఈ ఘోర ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను వెంటనే సంప్రదించి, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Image

Image

Image

Image

(Photos Credit : UNI)

Advertisement
Advertisement