Fuel prices | ముడి చమురు తగ్గినా.. ఇంధన ధరలను వెంటనే తగ్గించలేం: కేంద్రం
Fuel prices | మధ్యప్రాచ్యంలో గత మూడు నెలలుగా కొనసాగిన సంక్షోభానికి (America Iran War) తెర పడటంతో ముడి చమురు ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన మన దేశంలో ఇంధన ధరలను (Fuel prices) వెంటనే తగ్గిండచం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
Fuel prices | ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం (America Iran War) ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) డిజిటల్గా సంతకాలు చేశారు. ఈ డీల్తో మధ్యప్రాచ్యంలో గత మూడు నెలలుగా కొనసాగిన సంక్షోభానికి తెర పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు (global crude rates) తగ్గనున్నాయి. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel prices) కూడా తగ్గే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం తాజాగా స్పందించింది.
పశ్చిమాసికా సంక్షోభం కారణంగా మన దేశంలో ఇంధన ధరలను లీటరుకు రూ.3.94 మేర మాత్రమే పెంచినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి (Union Minister Suresh Gopi) తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన మన దేశంలో ఇంధన ధరలను వెంటనే తగ్గిండచం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తక్కువ ధరకు లభించే ముడి చమురు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా భారత్కు రవాణా కావడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఓడల రాకపోకల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావాల్సి ఉందన్నారు. ఈ కారణాలతో పాటు మరికొన్ని ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆ ప్రభావాన్ని చాలా వరకూ కేంద్రమే భరించిందన్నారు. ఫలితంగా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు. ఇంధన ధరలు పెరిగినప్పుడు తమ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని ప్రజలకు ఊరట కల్పించేందుకు ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదన్నారు. దీంతో ఆర్థిక భారం అంతా కేంద్ర ప్రభుత్వంపైనే పడిందని పేర్కొన్నారు. ఇంధన ధరలను నియంత్రించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సుమారు రూ.12 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని సురేశ్ గోపీ వెల్లడించారు.
Also Read..
మేడ్చల్లో కారు.. లింగాలఘనపూర్లో మినీ ట్రక్కు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
రెచ్చిపోయిన కేన్.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

America Iran War | అమెరికా, ఇరాన్ యుద్ధం.. ప్రపంచ దేశాలపై ప్రభావం..
జూన్ 18, 2026

America Iran War | ముగిసిన అమెరికా, ఇరాన్ యుద్ధం.. ఒప్పందపై ట్రంప్, పెజెష్కియాన్ సంతకం
జూన్ 18, 2026

PM Modi Donald Trump | నావికుల భద్రతే మాకు ముఖ్యం.. జీ7 సమ్మిట్లో ట్రంప్కి తేల్చిచెప్పిన మోదీ.. నువ్వు దేవదూతవు అంటూ ఆకాశానికెత్తిన ట్రంప్
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Preity Mukhundhan | రెమ్యూనరేషన్ డబుల్ చేసిన కన్నప్ప హీరోయిన్ - శర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందంటే?
- ●Ponnam Prabhakar | జూలై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్
- ●Vacuum | రోబో వాక్యూమ్ లేదా సాధారణ వాక్యూమ్? రెండింటిలో ఏది బెస్ట్?
- ●India In G7 | సభ్యదేశం కాదు.. అయినా భారత్కు రెడ్ కార్పెట్ పరుస్తున్న జీ7 దేశాలు.. న్యూఢిల్లీకి ఎందుకంత ప్రాధాన్యం..?
- ●Tollywood | కృతి శెట్టి , కీర్తి సురేష్లతో టాలీవుడ్ డైరెక్టర్ అనుచిత ప్రవర్తన - నెటిజన్ల ఫైర్
- ●EPF | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలాఖరు వరకు ఖాతాల్లో వడ్డీ జమ..

Preity Mukhundhan | రెమ్యూనరేషన్ డబుల్ చేసిన కన్నప్ప హీరోయిన్ - శర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందంటే?

Ponnam Prabhakar | జూలై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్

Vacuum | రోబో వాక్యూమ్ లేదా సాధారణ వాక్యూమ్? రెండింటిలో ఏది బెస్ట్?

India In G7 | సభ్యదేశం కాదు.. అయినా భారత్కు రెడ్ కార్పెట్ పరుస్తున్న జీ7 దేశాలు.. న్యూఢిల్లీకి ఎందుకంత ప్రాధాన్యం..?



