త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫ‌ర్‌..

IPO | ప్రైమరీ మార్కెట్ వచ్చే వారం సందడిగా మారనుంది. సెప్టెంబర్ 22 నుంచి 24 మధ్య ఆరు కంపెనీలు తమ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్‌లను ప్రారంభించనున్నాయి. వర్మోరా గ్రానిటో లిమిటెడ్ సెప్టెంబర్ 22న ఐపీవోను ప్రారంభించనుండగా, ఆర్మీ ఇన్ఫోటెక్ లిమిటెడ్, స్వస్తిక ఇన్‌ఫ్రా లిమిటెడ్, ఎలివేట్ క్యాంపసెస్ లిమిటెడ్, అడ్రాయిట్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్ సెప్టెంబర్ 23న ఐపీవోలకు రానున్నాయి.

S

Business | Published On Sep 19, 2026, 4.00 pm IST

IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫ‌ర్‌..
Advertisement

IPO | ప్రైమరీ మార్కెట్ వచ్చే వారం సందడిగా మారనుంది. సెప్టెంబర్ 22 నుంచి 24 మధ్య ఆరు కంపెనీలు తమ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్‌లను ప్రారంభించనున్నాయి. వర్మోరా గ్రానిటో లిమిటెడ్ సెప్టెంబర్ 22న ఐపీవోను ప్రారంభించనుండగా, ఆర్మీ ఇన్ఫోటెక్ లిమిటెడ్, స్వస్తిక ఇన్‌ఫ్రా లిమిటెడ్, ఎలివేట్ క్యాంపసెస్ లిమిటెడ్, అడ్రాయిట్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్ సెప్టెంబర్ 23న ఐపీవోలకు రానున్నాయి. ఎ-వన్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్ సెప్టెంబర్ 24న ఐపీవోను ప్రారంభించనుంది. ఈ ఆరు ఐపీఓల ద్వారా కలిపి సుమారు రూ.3,824.61 కోట్లను సమీకరించాలని కంపెనీలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఇందులో సుమారు రూ.3,336.12 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా, మరో రూ.488.02 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించనున్నారు. సిరామిక్, విట్రిఫైడ్ టైల్స్, ఐటీ మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్రసారం, పంపిణీ, విద్యార్థుల వసతి, ఆటోమొబైల్ విడిభాగాలు, ఉక్కు తయారీ వంటి విభిన్న రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఐపీఓల ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయి.

వ‌ర్మోరా గ్రానిటో లిమిటెడ్‌..

వర్మోరా గ్రానిటో లిమిటెడ్ రూ.708.02 కోట్ల ఐపీఓను సెప్టెంబర్ 22న ప్రారంభించి, సెప్టెంబర్ 24న ముగించనుంది. ఇందులో రూ.320 కోట్ల విలువైన 2.16 కోట్ల కొత్త షేర్ల జారీతోపాటు రూ.388.02 కోట్ల విలువైన 2.62 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.140 నుంచి రూ.148గా నిర్ణయించారు. లాట్ పరిమాణం 101 షేర్లు. గరిష్ఠ ధర రూ.148 ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం కనీసం రూ.14,948 పెట్టుబడి పెట్టాలి. షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 25న పూర్తయ్యే అవకాశం ఉండగా, సెప్టెంబర్ 29న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. జేఎం ఫైనాన్షియల్, గోల్డ్‌మన్ సాక్స్ ఇండియా సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా ఉంది.

ఆర్మీ ఇన్ఫోటెక్ లిమిటెడ్‌, స్వస్తిక ఇన్‌ఫ్రా లిమిటెడ్‌..

ఆర్మీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ రూ.300 కోట్ల ఐపీఓను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. సెప్టెంబర్ 25న ముగియనున్న ఈ ఐపీఓ పూర్తిగా కొత్త షేర్ల జారీతోనే ఉంటుంది. మొత్తం 80 లక్షల షేర్లను జారీ చేయనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ఉండదు. ఒక్కో షేరుకు రూ.350 నుంచి రూ.375 ధరల శ్రేణిని నిర్ణయించారు. లాట్ పరిమాణం 40 షేర్లు. గరిష్ఠ ధర రూ.375 ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక లాట్ కోసం కనీస పెట్టుబడి రూ.15వేలు. సెప్టెంబర్ 28న షేర్ల కేటాయింపు పూర్తయ్యే అవకాశం ఉండగా, సెప్టెంబర్ 30న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. ఖండ్వాలా సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, కామియో కార్పొరేట్ సర్వీసెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. స్వస్తిక ఇన్‌ఫ్రా లిమిటెడ్ రూ.160.88 కోట్ల ఐపీఓను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. సెప్టెంబర్ 25న ముగియనున్న ఈ ఐపీఓలో రూ.128.50 కోట్ల విలువైన 69.46 లక్షల కొత్త షేర్లతోపాటు రూ.32.38 కోట్ల విలువైన 17.50 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఒక్కో షేరుకు రూ.175 నుంచి రూ.185 ధరల శ్రేణిని నిర్ణయించారు. లాట్ పరిమాణం 81 షేర్లు. గరిష్ఠ ధర ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక లాట్ కోసం రూ.14,985 అవసరం. సెప్టెంబర్ 28న కేటాయింపు పూర్తయ్యే అవకాశం ఉండగా, సెప్టెంబర్ 30న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. సృజన్ ఆల్ఫా క్యాపిటల్ అడ్వైజర్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, ఎంయూఎఫ్‌జీ ఇంటైమ్ ఇండియా రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి.

ఎలివేట్ క్యాంప‌సెస్ లిమిటెడ్‌, అడ్రాయిట్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌..

ఎలివేట్ క్యాంపసెస్ లిమిటెడ్ రూ.2,100 కోట్ల ఐపీఓను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. సెప్టెంబర్ 25న ముగియనున్న ఈ ఐపీఓ పూర్తిగా కొత్త షేర్ల జారీతోనే ఉంటుంది. మొత్తం 5.80 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఒక్కో షేరుకు రూ.343 నుంచి రూ.362 ధరల శ్రేణిని నిర్ణయించారు. లాట్ పరిమాణం 41 షేర్లు. గరిష్ఠ ధర ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక లాట్ కోసం రూ.14,842 పెట్టుబడి అవసరం. సెప్టెంబర్ 28న కేటాయింపు పూర్తయ్యే అవకాశం ఉండగా, సెప్టెంబర్ 30న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. జేఎం ఫైనాన్షియల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా ఉన్నాయి. అడ్రాయిట్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్ రూ.150.71 కోట్ల ఐపీఓను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. సెప్టెంబర్ 25న ముగియనున్న ఈ ఐపీఓలో రూ.132.62 కోట్ల విలువైన 98.97 లక్షల కొత్త షేర్లు, రూ.18.09 కోట్ల విలువైన 13.50 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.126 నుంచి రూ.134 ధరల శ్రేణిని నిర్ణయించారు. లాట్ పరిమాణం 111 షేర్లు. గరిష్ఠ ధర ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక లాట్ కోసం రూ.14,874 పెట్టుబడి అవసరం. సెప్టెంబర్ 28న కేటాయింపు పూర్తయ్యే అవకాశం ఉండగా, సెప్టెంబర్ 30న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. చాయిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్‌గా ఉన్నాయి.

ఎ-వ‌న్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్..

ఎ-వన్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్ రూ.405 కోట్ల ఐపీఓను సెప్టెంబర్ 24న ప్రారంభించనుంది. సెప్టెంబర్ 28న ముగియనున్న ఈ ఐపీఓలో రూ.355 కోట్ల విలువైన 87.65 లక్షల కొత్త షేర్లతో పాటు రూ.50 కోట్ల విలువైన 12.35 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంది. ఒక్కో షేరుకు రూ.385 నుంచి రూ.405 ధరల శ్రేణిని నిర్ణయించారు. లాట్ పరిమాణం 37 షేర్లు. గరిష్ఠ ధర ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక లాట్ కోసం రూ.14,985 పెట్టుబడి అవసరం. సెప్టెంబర్ 29న కేటాయింపు పూర్తయ్యే అవకాశం ఉండగా, అక్టోబర్ 1న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో షేర్లు లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. పీఎల్ క్యాపిటల్ మార్కెట్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి.

వచ్చే వారం ఐపీఓ మార్కెట్‌లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించనున్న ఈ ఆరు కంపెనీలు వేర్వేరు రంగాలకు చెందినవిగా ఉన్నాయి. ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక ఫలితాలు, రుణ భారం, వాల్యుయేషన్, ఐపీఓ నిధుల వినియోగం, పరిశ్రమ పరిస్థితులు, రిస్క్ అంశాలను పరిశీలించడం కీలకం.

Advertisement
Advertisement