త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ అల‌ర్ట్‌.. వ‌రుస‌ సెలవులు, ఏటీఎంలు ప‌నిచేస్తాయా..?

SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌న కస్టమర్లకు ముఖ్యమైన సూచన చేసింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 11న ఒకరోజు సమ్మెకు ప్రతిపాదించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

S

Business | Published On Sep 10, 2026, 1.22 pm IST

SBI | క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ అల‌ర్ట్‌.. వ‌రుస‌ సెలవులు, ఏటీఎంలు ప‌నిచేస్తాయా..?
Advertisement

SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌న కస్టమర్లకు ముఖ్యమైన సూచన చేసింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 11న ఒకరోజు సమ్మెకు ప్రతిపాదించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలను అందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సమ్మె తేదీకి ముందుగానే ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని ఎస్‌బీఐ కస్టమర్లను కోరింది.

నగదు అవసరాల కోసం ఏటీఎంలు, ఏడబ్ల్యూఎంలను ఉపయోగించుకోవాలని సూచించింది. అలాగే కస్టమర్ సర్వీస్ పాయింట్లను కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐతో పాటు ఇతర డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలను ప్రాధాన్యంగా ఉపయోగించాలని ఎస్‌బీఐ సూచించింది. సమ్మె కారణంగా కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, కస్టమర్లు అర్థం చేసుకుని సహకరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది.

Advertisement
Advertisement