త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | ఆర్బీఐ కఠిన చర్యలు.. బ్యాంకుపై ఆంక్షలు, డిపాజిటర్లకు కీలక సూచనలు..

RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించిన మూడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ఓ సహకార బ్యాంకుపై చర్యలు తీసుకున్న‌ట్లు ప్రకటించింది. కొన్నింటిపై జరిమానాలు విధించగా, ఒక బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది.

S

Business | Published On Jun 15, 2026, 2.45 pm IST

RBI | ఆర్బీఐ కఠిన చర్యలు.. బ్యాంకుపై ఆంక్షలు, డిపాజిటర్లకు కీలక సూచనలు..
Advertisement

RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించిన మూడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ఓ సహకార బ్యాంకుపై చర్యలు తీసుకున్న‌ట్లు ప్రకటించింది. కొన్నింటిపై జరిమానాలు విధించగా, ఒక బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. ఈ వివరాలను ఆర్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1934 ఆర్బీఐ యాక్ట్‌లోని వివిధ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ముంబైకి చెందిన మోగావీర్ కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు కఠిన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12 నుంచి ఆరు నెలల పాటు బ్యాంకు తన సాధారణ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కాలంలో బ్యాంకు కొత్త రుణాలు మంజూరు చేయడం, ఇప్పటికే ఉన్న రుణాలను పునరుద్ధరించడం లేదా ఇతర ఆర్థిక ఒప్పందాల్లో పాల్గొనడాన్ని అనుమతించరు. బ్యాంకు లిక్విడిటీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

ఇది లైసెన్స్ ర‌ద్దు కాదు..

అయితే ఈ చర్యను బ్యాంకు లైసెన్స్ రద్దుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. వచ్చే ఆరు నెలల పాటు పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ ఆదేశాల ప్రభావం బ్యాంకు ఖాతాదారులపై కూడా ఉంటుంది. ప్రజల సమాచారం కోసం ఆదేశాల ప్రతిని బ్యాంకు వెబ్‌సైట్ లేదా శాఖ ప్రాంగణంలో ప్రదర్శించాలని ఆర్బీఐ సూచించింది. డిపాజిటర్లకు కొంత ఊరట కల్పిస్తూ, ఒక్కో ఖాతాదారు గరిష్టంగా రూ.1 లక్ష వరకు నగదు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆర్బీఐ నిర్దేశించిన షరతుల మేరకు డిపాజిట్లకు వ్యతిరేకంగా రుణాల సర్దుబాటు, ఉద్యోగుల జీతాలు, అద్దె, విద్యుత్ బిల్లులు వంటి అవసరమైన ఖర్చులు చెల్లించడానికి కూడా అనుమతి ఉంటుంది. ఇక డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నిబంధనల ప్రకారం, ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్లపై గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా క్లెయిమ్ పొందే అర్హత కలిగి ఉంటారు.

Advertisement
Advertisement