త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌కు స్వల్ప ఊరట.. పెట్టుబ‌డిదారుల్లో యుద్ధం టెన్ష‌న్‌..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం స్వ‌ల్ప లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. వ‌రుస‌గా రెండు రోజుల పాటు మార్కెట్ల‌లో న‌ష్టాలు రాగా ప్ర‌స్తుత సెష‌న్‌లో సూచీలు కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ50 బెంచ్ మార్క్ సూచీలు స్వ‌ల్ప లాభాల్లో కొన‌సాగుతున్నాయి.

S

Business | Published On Jul 1, 2026, 9.52 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌కు స్వల్ప ఊరట.. పెట్టుబ‌డిదారుల్లో యుద్ధం టెన్ష‌న్‌..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం స్వ‌ల్ప లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. వ‌రుస‌గా రెండు రోజుల పాటు మార్కెట్ల‌లో న‌ష్టాలు రాగా ప్ర‌స్తుత సెష‌న్‌లో సూచీలు కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ50 బెంచ్ మార్క్ సూచీలు స్వ‌ల్ప లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌డం, అంచ‌నాల‌కు త‌గిన విధంగా దేశంలో రుతు ప‌వ‌నాలు లేక‌పోవ‌డం తదితర అంశాలు మార్కెట్ల సెంటిమెంట్‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. దీంతో పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్పష్ట‌మ‌వుతోంది. ఉద‌యం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 150 పాయింట్ల‌కు పైగా లాభపడగా, నిఫ్టీ 50 సూచీ 23,900 స్థాయికి పైన‌ ట్రేడ్ అయింది. విస్తృత మార్కెట్లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు 0.2 శాతం మేర పెరిగాయి.

1678 షేర్లు లాభాల్లో..

సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్ షేర్లు ఒక్కోటి 1 శాతానికి పైగా లాభపడి టాప్ గెయినర్లుగా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, ట్రెంట్ షేర్లు కూడా దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి. ఇక బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు 1 శాతం మేర క్షీణించి మార్కెట్ల‌ ధోరణికి భిన్నంగా కదిలాయి. మార్కెట్‌ల‌లో అస్థిరతను సూచించే ఇండియా విక్స్ స్వల్పంగా తగ్గి 13.60 వద్ద ట్రేడ్ అయింది. ఇది ఇన్వెస్టర్లలో భయాందోళనలు కొంత తగ్గిన సంకేతంగా సూచిస్తోంది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్జూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ రియాల్టీ సూచీలు దాదాపు 1 శాతం చొప్పున పెరిగి ముందంజలో నిలిచాయి. మరోవైపు నిఫ్టీ మెటల్ సూచీ మాత్రం నష్టాల్లోకి చేరింది. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1,678 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, 581 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరో 134 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

కాగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బుధ‌వారం చ‌మురు ధ‌ర‌లు మ‌రోమారు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.34 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 73 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌వుతుండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.19 శాతం పెరిగి బ్యారెల్‌కు 69 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. అమెరికా, ఇరాన్ ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తుండడంతో హోర్ముజ్ జ‌ల‌సంధి ద్వారా చ‌మురు స‌ర‌ఫ‌రాకు మ‌రోమారు ఆటంకం క‌లుగుతుందేమోన‌ని మార్కెట్ల‌లో ఆందోళ‌న నెల‌కొంది. అందువ‌ల్ల‌నే గ‌త 4 సెష‌న్ల నుంచి చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరుగుతున్నాయి. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 94.72 వ‌ద్ద ఉన్న భార‌త రూపాయి ఇవాళ్టి సెష‌న్‌లో 0.07 శాతం మేర విలువ‌ను కోల్పోయింది.

Advertisement
Advertisement