త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌కు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అలాగే జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్‌పై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతం కావడంతో మార్కెట్‌ల‌కు సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు ఎగిశాయి.

S

Business | Published On Jul 16, 2026, 10.04 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌కు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..
Advertisement

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అలాగే జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్‌పై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతం కావడంతో మార్కెట్‌ల‌కు సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు ఎగిశాయి. ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 184.38 పాయింట్లు పెరిగి 77,369.81 వద్ద ట్రేడవ‌గా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 42.40 పాయింట్లు లాభపడి 24,120.90 వద్ద కొనసాగింది. మధ్యప్రాచ్య పరిణామాలను పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నప్పటికీ, ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటం మార్కెట్‌ల‌కు ఊరటనిచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర 0.40 శాతం తగ్గి బ్యారెల్‌కు 84.61 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 0.25 శాతం పడిపోయి బ్యారెల్‌కు 79.40 డాలర్ల వద్ద ట్రేడైంది. దీంతో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశాలపై ఉన్న ఆందోళనలు తగ్గాయి.

ఐటీ షేర్ల‌కు జోష్‌..

రూపాయి మారకపు విలువ కూడా పెద్దగా మారలేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 96.2475 వద్ద ప్రారంభమైంది. గత ముగింపు 96.2550గా నమోదైంది. ఐటీ రంగం గురువారం ట్రేడింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నిఫ్టీ ఐటీ సూచీ 1.49 శాతం పెరిగింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.74 శాతం, నిఫ్టీ మిడ్‌స్మాల్ ఐటీ అండ్ టెలికాం 1.09 శాతం, నిఫ్టీ కెమికల్స్ 0.67 శాతం, నిఫ్టీ ఆటో 0.63 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.38 శాతం లాభపడ్డాయి. అయితే ఆర్థిక సేవల రంగంలో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్-బ్యాంక్ 0.94 శాతం పడిపోగా, నిఫ్టీ మిడ్‌స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.17 శాతం క్షీణించింది. నిఫ్టీ రియాల్టీ కూడా 0.66 శాతం నష్టపోయింది. విస్తృత మార్కెట్‌ల‌లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. నిఫ్టీ 100 సూచీ 0.12 శాతం, నిఫ్టీ 200 సూచీ 0.06 శాతం, నిఫ్టీ 500 సూచీ 0.05 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ 2.33 శాతం తగ్గి 12.96 వద్దకు చేరింది. దీన్ని మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గుతున్న సంకేతంగా భావిస్తారు.

భారీగా లాభ‌ప‌డ్డ హెచ్‌సీఎల్ టెక్‌..

సెన్సెక్స్‌లోని షేర్లలో హెచ్‌సీఎల్‌టెక్ 2.32 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం మహీంద్రా అండ్ మహీంద్రా 1.49 శాతం, టెక్ మహీంద్రా 1.30 శాతం, ఇన్ఫోసిస్ 1.30 శాతం, మారుతి సుజుకి 1.18 శాతం, టైటాన్ 1.03 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ 0.50 శాతం పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ 0.41 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.33 శాతం, సన్ ఫార్మా 0.21 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.17 శాతం మేర క్షీణించాయి.

Advertisement
Advertisement