త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Income Tax Department | అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ఐటీ శాఖ నజర్

Income Tax Department | ఆదాయపు పన్ను శాఖ దేశవ్యాప్తంగా అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ప్రత్యేక ధ్రువీకరణ చర్యలు చేపట్టింది. పెద్ద మొత్తంలో విదేశాలకు నగదు పంపుతున్నప్పటికీ, తమ వ్యాపార కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నట్లు లేదా అసలు లేనట్లు ఆదాయపు పన్ను వివరాల్లో చూపిస్తున్న సంస్థలపై డేటా విశ్లేషణ, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ఈ చర్యలు ప్రారంభించింది.

S

Business | Published On Aug 19, 2026, 1.22 pm IST

Income Tax Department | అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ఐటీ శాఖ నజర్
Advertisement

Income Tax Department | ఆదాయపు పన్ను శాఖ దేశవ్యాప్తంగా అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ప్రత్యేక ధ్రువీకరణ చర్యలు చేపట్టింది. పెద్ద మొత్తంలో విదేశాలకు నగదు పంపుతున్నప్పటికీ, తమ వ్యాపార కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నట్లు లేదా అసలు లేనట్లు ఆదాయపు పన్ను వివరాల్లో చూపిస్తున్న సంస్థలపై డేటా విశ్లేషణ, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ఈ చర్యలు ప్రారంభించింది. నకిలీ విరాళాలు, చందాలకు బదులుగా వసతి ఎంట్రీలు అందిస్తున్న కల్పిత స్వచ్ఛంద ట్రస్టుల సమూహంపై జరిగిన సోదాల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సోదాల్లో విదేశాలకు నిధులు పంపిస్తున్న సంస్థలతో కూడిన దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయి ప్రాథమిక పరిశీలనలో ఈ సంస్థలు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని సంస్థలుగా లేదా చాలా స్వల్ప టర్నోవర్‌ను చూపించిన సంస్థలుగా ఉన్నట్లు తేలింది. అయితే, అవి విదేశాలకు పంపిన భారీ మొత్తాలకు ప్రకటించిన వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి స్పష్టమైన సంబంధం కనిపించలేదు.

స‌రిపోల‌ని కార‌ణాలు..

విదేశాలకు పంపిన నిధులకు సరుకు రవాణా చెల్లింపులు, సాఫ్ట్‌వేర్ దిగుమతి, కన్సల్టింగ్ సేవల దిగుమతి వంటి కారణాలను పేర్కొన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులతో అవి సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. మరింత సమాచారం సేకరించిన తర్వాత, ఈ సంస్థలు తమ ఆదాయపు పన్ను రికార్డుల్లో పేర్కొన్న చిరునామాల్లో వాస్తవంగా కార్యకలాపాలు నిర్వహించడం లేదని కూడా తేలింది. డేటా విశ్లేషణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫామ్ 15సీబీ ధ్రువపత్రాలను తక్కువ సంఖ్యలో క‌లిగి ఉన్న కొంతమంది వృత్తి నిపుణులే పెద్ద సంఖ్యలో జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే విదేశాలకు పంపిన నిధులు కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్లు కనిపించే కొద్దిమంది సంస్థల సమూహానికి చేరినట్లు గుర్తించారు.

https://twitter.com/IncomeTaxIndia/status/2089665949469458834?s=20

ఐటీ శాఖ‌కు అనుమానాలు..

ఆదాయపు పన్ను నిబంధనలు, 1962లోని రూల్ 37బీబీతో కలిపి ఫామ్ 15సీబీ ప్రకారం, ధ్రువీకరణ జారీ చేసే చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థ ఖాతా పుస్తకాలు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించి విదేశాలకు పంపుతున్న నగదుపై పన్ను వర్తిస్తుందా లేదా అనే అంశాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2026 ఆదాయపు పన్ను నిబంధనల్లో ఇదే నిబంధన ఫామ్ 146, రూల్ 220కు అనుగుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ధ్రువపత్రాలు జారీ చేసే ముందు అకౌంటెంట్లు తగిన స్థాయిలో పరిశీలన, జాగ్రత్తలు పాటించారా అనే అంశంపై ఆదాయపు పన్ను శాఖకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టు 18న ప్రారంభమైన ఈ దేశవ్యాప్త ధ్రువీకరణ చర్యల్లో షెల్ సంస్థలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, ఫామ్ 15సీబీ లేదా ఫామ్ 146 జారీ చేసిన వృత్తి నిపుణులపై ప్రధానంగా దృష్టి సారించారు. దేశ భూ సరిహద్దులకు ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.

క్షుణ్ణంగా ప‌రిశీల‌న‌..

ఇప్పటివరకు సుమారు 394 సంస్థలను ఈ పరిశీలన పరిధిలోకి తీసుకురాగా, వాటిలో 117 సంస్థలు దేశ భూ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. వీటితో పాటు 36 మంది వృత్తి నిపుణులను కూడా పరిశీలిస్తున్నారు. ఫామ్ 15సీబీ లేదా ఫామ్ 146 జారీ చేసే సమయంలో వృత్తి నిపుణులు తగిన జాగ్రత్తలు, వృత్తిపరమైన విచక్షణ పాటించాలని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోందని పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement