Principal Murdered | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు.. 27 సార్లు కత్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు
Principal Murdered | నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీకి చెందిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.
- ఇద్దరి అరెస్టు, సాయంత్రంలోగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటన
Principal Murdered | త్రినేత్ర.న్యూస్: నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీకి చెందిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. టెన్త్ విద్యార్థులే ఆమెను 27 సార్లు పొడిచి హత్య చేశారని తెలిపారు. గంజాయికి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. బుధవారం ఇద్దరు పదో తరగతి విద్యార్థులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 11న రూపారెడ్డి స్కూల్ విధులు ముగిసి ఇంటికి బయలుదేరారు. ఆమె ఇంటికి వచ్చే సమయానికంటే ముందే నిందితులు గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లారు. ఈ సమయంలో నిందితులు వంటగదిలో దాక్కున్నారు. ప్రిన్సిపల్ ఫ్రెష్ అయి బెడ్రూమ్లోకి వెళ్లగానే ఊహించని స్థితిలో వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు అతి దారుణంగా పొడిచారు. ఆమె అపాస్మారక స్థితిలోకి వెళ్లగానే హ్యాండ్ బ్యాగ్లో ఉన్న రూ.2 లక్షల రూపాయలను తీసుకొని పరారయ్యారు. చోరీ చేసిన డబ్బుతో హైదరాబాద్లో జల్సాలు చేసేందుకు పతకం పన్నారు. ఈ హత్య సమయంలో నిందితులు ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ దారుణానికి పాల్పడింది పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురని సమాచారం. డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 80 మందిని విచారించిన అనంతరం కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించారు. ముగ్గురిపై అనుమానంతో ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నేడు సాయంత్రం లోగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

Auto Bandh | ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు బంద్
ఆగస్టు 19, 2026

Bhatti Vikramarka | పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Stray Dogs | వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
- ●BPCL | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రూ.5వేల కోట్లకు బీపీసీఎల్ డిబెంచర్లు..
- ●Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
- ●CM Vijay | కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు
- ●iQOO Hackathon 2026 | డెవలపర్లు, విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఐక్యూ హ్యాకథాన్ ప్రైజ్ మనీ రూ.25 లక్షలు..
- ●Gorintaku Panduga | న్యూయార్క్లో ఘనంగా గోరింటాకు పండుగ..

Stray Dogs | వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి

BPCL | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రూ.5వేల కోట్లకు బీపీసీఎల్ డిబెంచర్లు..

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల

CM Vijay | కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు



