త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Excise Duty | వాహ‌న‌దారుల‌కు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు

xcise Duty | ఇరాన్‌, అమెరికా యుద్ధంతో (Iran US War) ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. దేశంలోనూ పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel), గ్యాస్ కొర‌త ఏర్ప‌డింది.

G

National | Published On Mar 27, 2026, 9.20 am IST

Excise Duty | వాహ‌న‌దారుల‌కు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు
Advertisement

Excise Duty | త్రినేత్ర‌.న్యూస్‌: ఇరాన్‌, అమెరికా యుద్ధంతో (Iran US War) ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. దేశంలోనూ పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel), గ్యాస్ కొర‌త ఏర్ప‌డింది. దీంతో పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల వ‌ద్ద వాహ‌న‌దారులు, ప్ర‌జ‌లు బారులు తీరుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న‌ది. పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని (Excise Duty) తగ్గించింది.  లీటర్‌ పెట్రోల్‌పై రూ.3కు తగ్గించింది. ఇప్ప‌టివ‌ర‌కు అది రూ.13గా ఉన్న‌ది. ఇక‌ డీజిల్‌పై రూ.10గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరల భారాన్ని ప్రజల పైకి బదిలీ చేయకుండా కొంతమేర ఉపకరించవచ్చు.

60 రోజుల‌కు స‌రిప‌డా నిల్వ‌లు..

దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులను న‌మ్మొద్ద‌ని కేంద్ర ప్రభుత్వం వెల్ల‌డించింది. పెట్రోలియం, ఎల్‌పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా, నియంత్రణలో ఉందని స్పష్టం చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రానున్న‌ 60 రోజులకు సరిపడా ముడి చమురును కంపెనీలు ఇప్పటికే సేకరించాయ‌ని కేంద్రం తెలిపింది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి 8 ల‌క్ష‌ల‌ మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ సరుకు సముద్ర మార్గంలో భారత్‌కు వస్తున్న‌ద‌ని వెల్ల‌డించింది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement