Bandi Sanjay | 20 ఏళ్ల నుంచి జ్వరం లేదు.. నాకు మోదీనే స్ఫూర్తి : బండి సంజయ్
Bandi Sanjay | ఆరోగ్యం విషయంలో నాకు నరేంద్ర మోదీనే స్ఫూర్తి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నాకు 20 ఏళ్ల నుంచి జ్వరం, దగ్గు లేదని ఆయన తెలిపారు.
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : ఆరోగ్యం విషయంలో నాకు నరేంద్ర మోదీనే స్ఫూర్తి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నాకు 20 ఏళ్ల నుంచి జ్వరం, దగ్గు లేదని ఆయన తెలిపారు. జమ్మికుంటలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన రైతు సమ్మేళనానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
గో మాత, భూమాత, భారత్ మాత నినాదంతో ప్రకృతి వ్యవసాయమే మంచిదనే విధానంతో కృషి విజ్ఞాన కేంద్రం వారు చేస్తున్న కృషి అభినందనీయం. ప్రస్తుతం 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మరో 50 ఎకరాల్లో విస్తరించేందుకు ముందుకు వచ్చిన కృషి విజ్ఞాన కేంద్రాన్ని అభినందిస్తున్నాను. కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా తయారు చేస్తానని మాటిచ్చారు మోదీ. మీ ఎంపీగా కష్టపడి పని చేస్తున్నాను.. 25 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలి. అందుకు ప్రోత్సాహం అందిస్తాను అని సంజయ్ పేర్కొన్నారు.
మనం పైసలిచ్చి రోగాలను కొనుకుంటున్నాం..
మనం పైసలిచ్చి రోగాలను కొనుకుంటున్నాం.. వృద్ధులు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు పదేండ్ల పిల్లలకు బీపీ, షుగర్ వస్తుంది. మిల్లెట్స్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్ ఒకప్పుడు వ్యవసాయాధిరిత దేశం. ప్రస్తుతం ఆ దేశం అడుక్కుతినే పరిస్థితి వచ్చింది. దిగుబడి కోసం అధికంగా కెమికల్స్ వినియోగం వల్ల భూములన్ని సర్వనాశనం అయ్యాయి. ప్రపంచంలోనే క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి ఉజ్బెకిస్థాన్లో. పంజాబ్లో ఒక ఏరియాను క్యాన్సర్ బ్లాక్గా ప్రకటించారు. ఆ ఏరియాలోనే ఎక్కువగా వరి పండిస్తున్నారు. తెలంగాణ కూడా నాలుగో ఐదో ప్లేస్లో ఉందని బండి సంజయ్ తెలిపారు.
రైతులు కోటీశ్వరులు అయ్యే పరిస్థితి లేదు..
ఎక్కువ పాలు రావాలని ఆవులకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు. పది సంవత్సరాలు పాలిచ్చే ఆవు.. రెండు మూడేండ్లకు పరిమితం అవుతుంది. ట్రీట్మెంట్ లేని గడ్డి మందును వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. హైబ్రిడ్ మ్యాంగో తిని ఇద్దరమ్మాయిలు చనిపోయారు. హైదరాబాద్లో పాలు తాగి మూడు రోజులు బెడ్ మీద పడ్డాను. 20 ఏండ్ల నుంచి జ్వరం లేదు. నాకు నరేంద్ర మోదీనే స్ఫూర్తి.. అమ్మవారి భక్తుడిని. చివరకు పాలు తాగి బెడ్ మీద పడ్డాను. జ్వరం, దగ్గు, దమ్ము, బీపీ, షుగర్ లేదు.. తప్పు నాదే. ప్రస్తుత కాలంలో ఈ పూట గురించి ఆలోచించకూడదు.. రైతులు కోటీశ్వరులు అయ్యే పరిస్థితి లేదు. ధాన్యమే కొనే పరిస్థితి లేదు. సమస్యలు వస్తుంటాయి. వీటన్నింటిని అధిగమించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. రోగాలకు కారకులం మనమే.. నివారకులం కూడా మనమే అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Ravi Teja | ట్రాన్స్జెండర్గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?
- ●Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
- ●Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్
- ●Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
- ●Amazfit Cheetah | చీతా సిరీస్లో రెండు పవర్ఫుల్ స్మార్ట్ వాచ్లను లాంచ్ చేసిన అమేజ్ఫిట్
- ●TMC-Congress | కాంగ్రెస్లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

Ravi Teja | ట్రాన్స్జెండర్గా మాస్ మహారాజా - రూమర్లలో నిజమెంత?

Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

Jawaharlal Nehru vs Savarkar | నెహ్రూ vs సావర్కర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్పై కాంగ్రెస్ పోలీస్ కంప్లైంట్

Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!






