Hyderabad Airport | విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి చార్జీలు తగ్గింపు..
Hyderabad Airport | హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం చేసే దేశీయ ప్రయాణికులకు స్వల్ప ఊరట లభించనుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికులపై వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను భారత విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) రూ.750 నుంచి రూ.515కు తగ్గించింది.
Hyderabad Airport | హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం చేసే దేశీయ ప్రయాణికులకు స్వల్ప ఊరట లభించనుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికులపై వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను భారత విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) రూ.750 నుంచి రూ.515కు తగ్గించింది. ఈ కొత్త రుసుము సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. హైదరాబాద్ విమానాశ్రయానికి సంబంధించి నాలుగో నియంత్రణ కాలానికి ఏఈఆర్ఏ సాధారణ టారిఫ్ ఆర్డర్ను జారీ చేసింది. ఈ నాలుగో నియంత్రణ కాలం సెప్టెంబర్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు కొనసాగుతుంది. బహుళ సంవత్సరాల టారిఫ్ ప్రతిపాదనలో భాగంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) రూ.27,851 కోట్ల సమగ్ర ఆదాయ అవసరాన్ని ప్రతిపాదించింది. ప్రస్తుత విలువ ప్రకారం ఈ మొత్తం రూ.20,025 కోట్లుగా ఉంది.
ఏఈఆర్ఏ ప్రతిపాదన..
మూలధన వ్యయం, నిర్వహణ, కార్యకలాపాల వ్యయాలు, పెట్టుబడిపై రాబడి, విమానయానేతర ఆదాయాలు వంటి వివిధ నియంత్రణ అంశాలను పరిశీలించిన అనంతరం ఏఈఆర్ఏ ఈ ప్రతిపాదనను సవరించింది. జీహెచ్ఐఏఎల్ కోరిన మొత్తంతో పోలిస్తే తక్కువగా రూ.11,683.49 కోట్ల ప్రాథమిక సమగ్ర ఆదాయ అవసరాన్ని ఏఈఆర్ఏ ఆమోదించింది. ప్రస్తుత విలువలో ఇది రూ.9,308.20 కోట్లుగా ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ప్రయాణికుడిపై ప్రాథమిక యీల్డ్ రూ.426.39గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలు, యూజర్ డెవలప్మెంట్ ఫీజు, ఇతర విమానాశ్రయ రుసుముల మధ్య విభజించారు.
ఫీజులు ఎంత..
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికుల యూజర్ డెవలప్మెంట్ ఫీజును రూ.515గా ఏఈఆర్ఏ నిర్ణయించింది. జీహెచ్ఐఏఎల్ రూ.580 వసూలు చేయాలని ప్రతిపాదించగా, ప్రస్తుతం ఈ రుసుము రూ.750గా ఉంది. అదేవిధంగా బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఎఫ్ను రూ.1,030గా నిర్ణయించారు. విమానాశ్రయ నిర్వాహక సంస్థ రూ.1,150 ప్రతిపాదించగా, ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి రూ.1,500 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో మొత్తం ప్రయాణికుల రాకపోకల్లో దేశీయ ప్రయాణికుల వాటా సుమారు 82 శాతం ఉందని ఏఈఆర్ఏ తెలిపింది. అందువల్ల దేశీయ ప్రయాణికులపై యూడీఎఫ్ను నామమాత్ర స్థాయిలో ఉంచినట్లు పేర్కొంది. ఈ నిర్ణయం దేశీయ విమాన ప్రయాణాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు దేశీయ విమానయాన రంగం వృద్ధికి దోహదపడుతుందని ఏఈఆర్ఏ వివరించింది. ప్రారంభ టారిఫ్ కాలానికి దేశీయ విమానాల ల్యాండింగ్ ఛార్జీని మెట్రిక్ టన్నుకు రూ.435గా, అంతర్జాతీయ విమానాలకు మెట్రిక్ టన్నుకు రూ.630గా ఏఈఆర్ఏ నిర్ణయించింది.
నాలుగో నియంత్రణ కాలంలో..
నాలుగో నియంత్రణ కాలంలో వివిధ దశలకు వేర్వేరు యూడీఎఫ్ రుసుములను ఏఈఆర్ఏ నిర్ణయించింది. దేశీయ ప్రయాణికులకు సెప్టెంబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు బయలుదేరే సమయంలో యూడీఎఫ్ రూ.515గా ఉంటుంది. 2027-28లో రూ.555కు, 2028-29లో రూ.620కు పెరుగుతుంది. 2029 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రూ.670గా ఉంటుంది. అనంతరం 2029 నవంబర్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు రూ.415కు తగ్గుతుంది. అదే కాలాలకు దేశీయ ప్రయాణికులు విమానం దిగే సమయంలో చెల్లించాల్సిన యూడీఎఫ్ వరుసగా రూ.220, రూ.240, రూ.265, రూ.285, రూ.175గా ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికులకు బయలుదేరే యూడీఎఫ్ ప్రారంభంలో రూ.1,030గా ఉంటుంది. 2027-28లో రూ.1,085కు, 2028-29లో రూ.1,130కు, 2029 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రూ.1,175కు పెరుగుతుంది. 2029 నవంబర్ 1 నుంచి 2030 మార్చి 31 వరకు ఇది రూ.880గా, 2030-31లో రూ.915గా ఉంటుంది.
ల్యాండింగ్ ఛార్జీలు పెంపు..
అంతర్జాతీయ ప్రయాణికులు విమానం దిగే సమయంలో చెల్లించే యూడీఎఫ్ వరుసగా రూ.440, రూ.465, రూ.485, రూ.500, రూ.375, రూ.390గా నిర్ణయించారు. మరోవైపు విమానాల ల్యాండింగ్ ఛార్జీలను మాత్రం పెంచారు. దేశీయ విమానాలకు సెప్టెంబర్ నుంచి 2027 మార్చి వరకు మెట్రిక్ టన్నుకు రూ.435గా ఉంటుంది. 2027-28లో ఇది రూ.530కు, 2028-29లో రూ.640కు పెరుగుతుంది. 2029 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రూ.745కు చేరుతుంది. అనంతరం 2029 నవంబర్ 1 నుంచి 2030 మార్చి 31 వరకు రూ.230కు తగ్గి, 2030-31లో రూ.275గా ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు సంబంధించి అదే కాలాల్లో ల్యాండింగ్ ఛార్జీలు మెట్రిక్ టన్నుకు వరుసగా రూ.630, రూ.735, రూ.845, రూ.905, రూ.245, రూ.315గా నిర్ణయించారు. అంటే ప్రయాణికుల యూడీఎఫ్ తగ్గినప్పటికీ, విమానయాన సంస్థలపై విధించే ల్యాండింగ్ ఛార్జీల్లో మాత్రం నియంత్రణ కాలంలోని వివిధ దశల్లో పెరుగుదల, తగ్గుదల చోటుచేసుకోనుంది.
తాజావార్తలు
- ●S400 | ఎస్-400 కోసం పాక్ గూఢచర్యం!
- ●Prisha Singh | సక్సెస్ కోసం ప్రిషా మరో ప్రయత్నం.. ఈసారైనా ఫలిస్తుందా?
- ●Aishwarya Rajesh | హిట్ తర్వాత మరో బంపరాఫర్.. రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేశ్
- ●Rashmika Mandanna | బయోపిక్లో నేషనల్ క్రష్ - విజయ్ దేవరకొండకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో రష్మిక సినిమా!
- ●Nepal Police | టిబెట్లో డ్యామ్ లీకేజీ.. నేపాల్లో మళ్లీ వరద హెచ్చరికలు.. బీహార్ గ్రామాల్లో హైఅలర్ట్
- ●India Canada Trade | భారత్-కెనడా బంధం బలోపేతం.. రూ.4.65 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యం..

S400 | ఎస్-400 కోసం పాక్ గూఢచర్యం!

Prisha Singh | సక్సెస్ కోసం ప్రిషా మరో ప్రయత్నం.. ఈసారైనా ఫలిస్తుందా?

Aishwarya Rajesh | హిట్ తర్వాత మరో బంపరాఫర్.. రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేశ్

Rashmika Mandanna | బయోపిక్లో నేషనల్ క్రష్ - విజయ్ దేవరకొండకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో రష్మిక సినిమా!






