త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Stock Markets | క్రాష్ అవుతున్న భారత స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం గ్యాప్ డౌన్‌తో ఓపెన్

ప్రస్తుతం 72 పాయింట్ల నష్టంతో 59,110 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ బ్యాంక్ లోని కీలక బ్యాంకింగ్ స్టాక్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఈరోజు లో 59,072 గా ఉండగా, హై 59,180 గా ఉంది.

J

Business | Published On Dec 26, 2025, 11.02 am IST

Indian Stock Markets | క్రాష్ అవుతున్న భారత స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం గ్యాప్ డౌన్‌తో ఓపెన్
Advertisement

Indian Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు రోజురోజుకూ క్రాష్ అవుతున్నాయి. బేరిష్ మోడ్‌లోకి వెళ్తున్నాయి. గత వారం నుంచి మార్కెట్లు డౌన్ అవుతూ వస్తున్నాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 బేరిష్ జోన్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ బేరిష్ మోడ్‌లోకి వెళ్లాయి. దీంతో రానున్న రోజుల్లో భారత స్టాక్ మార్కెట్లు మరింత క్రాష్ అయ్యే చాన్స్ ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

25 డిసెంబర్ 2025న క్రిస్మస్ సెలవు కావడంతో భారత స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. 26 డిసెంబర్ 2025 శుక్రవారం గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 26,121 వద్ద ఓపెన్ కాగా, ప్రస్తుతం 26,090 వద్ద నడుస్తోంది. 50 పాయింట్లు కిందికి వెళ్లింది. నిఫ్టీ 50లో ఉన్న ప్రధాన స్టాక్స్ అన్నీ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఈరోజు లో 26,071 కాగా, ఈరోజు హై 26,144 గా ఉంది.

ఇక.. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 59,092 వద్ద గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయింది. ప్రస్తుతం 72 పాయింట్ల నష్టంతో 59,110 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ బ్యాంక్ లోని కీలక బ్యాంకింగ్ స్టాక్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఈరోజు లో 59,072 గా ఉండగా, హై 59,180 గా ఉంది.

మరోవైపు బీఎస్ఈ ఇండెక్స్ అయిన సెన్సెక్స్ ఇవాళ 85280 వద్ద ఓపెన్ అయింది. ప్రస్తుతం 51 పాయింట్ల నష్టంతో 85,212 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement