త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | “మర్యాదగా మాట్లాడు” అన్నందుకు రోగిని చితకబాదిన డాక్టర్

ఈ ఘటనతో ఆసుపత్రి ఎదుట రోగి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

J

Viral news | Published On Dec 23, 2025, 11.25 am IST

Viral Video | “మర్యాదగా మాట్లాడు” అన్నందుకు రోగిని చితకబాదిన డాక్టర్
Advertisement

Viral Video | ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే ఓ రోగిపై వీధి రౌడిలా విరుచుకుపడ్డాడు. తనను తు అంటూ ఏకవచనంతో పిలవొద్దని.. మర్యాదగా మాట్లాడండి అని రోగి అన్నందుకు ఆ రోగిని డాక్టర్ చితకబాదాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని ఐజీఎంసీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్జున్ పన్వార్ అనే రోగి సోమవారం వైద్య పరీక్షల కోసం ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్లాడు. అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఓ వార్డులోని బెడ్‌పై పడుకున్నాడు. అక్కడికి వచ్చిన డాక్టర్ “నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు” అంటూ ఏకవచనంతో మాట్లాడాడు. దీంతో “నన్ను గౌరవంగా పిలవండి” అంటూ అర్జున్ కోరాడు. అయినా డాక్టర్ వినకుండా నువ్వు అంటే నువ్వే అంటూ ఇంకా ఆ రోగిని హేళన చేశాడు. దీంతో మీ ఇంట్లో వాళ్లతో మీరు ఇలాగే మాట్లాడుతారా? అంటూ ఆ రోగి.. డాక్టర్‌ను ప్రశ్నించడంతో క్షణికావేశానికి లోనైన డాక్టర్.. ఆ రోగిపై దాడికి తెగబడ్డాడు.

Viral Video | రణరంగంలా మారిన ఆసుపత్రి

బెడ్‌పై పడుకొని ఉన్న రోగిపై ఆ డాక్టర్ పిడిగుద్దుల వర్షం కురిపించాడు. పదే పదే ముఖంపై చేతులతో కొట్టాడు. ఆ రోగి కూడా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా రోగికి గాయాలయ్యాయి. రోగిపై డాక్టర్ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనతో ఆసుపత్రి ఎదుట రోగి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ డాక్టర్‌పై రోగి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(Video Courtesy - ThePrint)

Advertisement

తాజావార్తలు

Advertisement