త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khammam | బ్రిడ్జికి ఉరేసుకున్న వృద్ధుడు.. వేరైన తల‌, మొండెం..!

Khammam | ఆర్థిక ఇబ్బందులు భ‌రించ‌లేక ఓ వృద్ధుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అది కూడా ఓ బ్రిడ్జికి ఉరేసుకోవ‌డంతో మొండెం నుంచి త‌ల భాగం తెగిపోయింది.

S

Telangana | Published On Mar 22, 2026, 3.13 pm IST

Khammam | బ్రిడ్జికి ఉరేసుకున్న వృద్ధుడు.. వేరైన తల‌, మొండెం..!
Advertisement

Khammam | త్రినేత్ర‌.న్యూస్ : ఆర్థిక ఇబ్బందులు భ‌రించ‌లేక ఓ వృద్ధుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అది కూడా ఓ బ్రిడ్జికి ఉరేసుకోవ‌డంతో మొండెం నుంచి త‌ల భాగం తెగిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం మండ‌లం బ‌నిగండ్ల‌పాడులో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌నిగండ్ల‌పాడుకు చెందిన యెన్నం వెంక‌ట్రామిరెడ్డి(70) గ‌త కొంత‌కాలం నుంచి తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గుర‌వుతున్నాడు. అప్పులు ఎక్కువ అయిపోవ‌డంతో.. ఆర్థిక ఇబ్బందుల‌ను భ‌రించ‌లేక‌పోయాడు. దీంతో చేసేదేమీ లేక స్థానికంగా ఉన్న ఓ బ్రిడ్జికి వృద్ధుడు ఉరేసుకున్నాడు. ఈ క్ర‌మంలో మొండెం, త‌ల వేర‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి భార్య‌, కుమార్తె ఉన్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎర్రుపాలెం ఎస్ఐ ర‌మేశ్ కుమార్ తెలిపారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement