Indiramma Illu | కుమారుడికి లండన్లో జాబ్.. కూతురికి కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్.. తల్లికి ఇందిరమ్మ ఇల్లు
Indiramma Illu | కడు నిరుపేదలకు గూడు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అత్యంత నిరుపేదలై ఉండి.. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారు అర్హులు. అంతేకాదు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.
Indiramma Illu | త్రినేత్ర.న్యూస్ : కడు నిరుపేదలకు గూడు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అత్యంత నిరుపేదలై ఉండి.. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారు అర్హులు. అంతేకాదు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే వారు ఇందిరమ్మ ఇల్లుకు అనర్హులు.
కానీ.. కుమారుడికి లండన్లో జాబ్.. కూతురు డిపార్ట్మెంట్లో జాబ్.. తల్లికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు.. భలే ఉంది కదా..! మరి ఎక్కడో కాదు.. సాక్షాత్తు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఖమ్మంలోని ఓ లబ్ధిరాలు చెప్పిన మాట ఇది.
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సందర్భంగా నిన్న పాలేరు నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. లబ్ధిరాలు ప్రసంగిస్తూ.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొంటూ సెలవిచ్చారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కల్పించుకుని.. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా అని అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పింది.
నా కొడుకు లండన్లో జాబ్ చేస్తున్నాడు.. కూతురు కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుందని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. నేను ఇప్పటి వరకు పెంకుటిల్లులోనే ఉంటున్నాను. తనకు ఇప్పటివరకు ఇల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి తన మనోభావాన్ని తెలియజేసింది ఆమె.
కొడుకు లండన్లో జాబ్, కూతురు కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్.. తల్లికి ఇందిరమ్మ ఇల్లు
ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు.. అడ్డంగా దొరికిపోయిన మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా పాలేరులో సభలో కొడుకు లండన్లో జాబ్ చేస్తున్నాడని, కూతురు కరెంట్ డిపార్ట్మెంట్లో పని చేస్తుందని, తనకు… pic.twitter.com/9BJ9b8ks3T
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



