త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahabubabad | అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన అటెండ‌ర్.. చెప్పుతో చిత‌క్కొట్టిన మ‌హిళ‌

Mahabubabad | న్యాయం కోసం వ‌చ్చిన ఓ మ‌హిళ ప‌ట్ల అటెండ‌ర్ అస‌భ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. అటెండ‌ర్ వేధింపులు తాళ‌లేక‌.. అత‌న్ని బాధిత మ‌హిళ చెప్పుతో చిత‌క్కొట్టింది.

S

Telangana | Published On Jun 1, 2026, 3.55 pm IST

Mahabubabad | అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన అటెండ‌ర్.. చెప్పుతో చిత‌క్కొట్టిన మ‌హిళ‌
Advertisement

Mahabubabad | త్రినేత్ర‌.న్యూస్ : న్యాయం కోసం వ‌చ్చిన ఓ మ‌హిళ ప‌ట్ల అటెండ‌ర్ అస‌భ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. అటెండ‌ర్ వేధింపులు తాళ‌లేక‌.. అత‌న్ని బాధిత మ‌హిళ చెప్పుతో చిత‌క్కొట్టింది. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో వెలుగు చూసింది.

జిల్లా ప‌రిధిలోని ప‌ర్వ‌త‌గిరికి చెందిన యాక‌మ్మ భూమి గ్రీన్ ఫీల్డ్ హైవేలో కోల్పోయింది. దీంతో త‌న‌కు రావాల్సిన డ‌బ్బులు వేరే వ్య‌క్తి ఖాతాలో జ‌మ అయ్యాయి. త‌న డ‌బ్బులు త‌న‌కు వ‌చ్చేలా చూడాల‌ని గ‌త కొద్ది కాలం నుంచి యాక‌మ్మ క‌లెక్ట‌రేట్ చుట్టూ తిరుగుతోంది.

ఈ క్ర‌మంలో క‌లెక్ట‌రేట్ రెవెన్యూ విభాగంలో ప‌ని చేసే అటెండ‌ర్ ముర‌ళీ.. ఆమెతో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. గ‌త కొద్దిరోజుల నుంచి వేధింపులు ఎక్కువ అవ‌డంతో.. త‌న సోద‌రుల‌కు బాధితురాలు చెప్పింది. దీంతో సోమ‌వారం క‌లెక్ట‌రేట్ చేరుకున్న యాక‌మ్మ‌.. అటెండ‌ర్ ముర‌ళీపై చెప్పుతో దాడి చేసింది.

అనంత‌రం క‌లెక్ట‌ర్ స్నేహ శ‌బ‌రీష్‌తో పాటు రూర‌ల్ పోలీసుల‌కు బాధిత మ‌హిళ ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. అటెండ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అటెండ‌ర్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని బాధితురాలి సోద‌రులు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement