త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weather Report | జూలై 15 వ‌ర‌కు ఎండ‌లే ఎండ‌లు.. బీ కేర్ ఫుల్

Weather Report | వానాకాలం వ‌చ్చి నెల రోజులు అవుతున్న‌ప్ప‌టికీ.. రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌వుతూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

S

Telangana | Published On Jul 12, 2026, 4.09 pm IST

Weather Report | జూలై 15 వ‌ర‌కు ఎండ‌లే ఎండ‌లు.. బీ కేర్ ఫుల్
Advertisement

Weather Report | త్రినేత్ర‌.న్యూస్ : వానాకాలం వ‌చ్చి నెల రోజులు అవుతున్న‌ప్ప‌టికీ.. రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌వుతూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర‌మంతా పొడి వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని, జూలై 15వ తేదీ వ‌ర‌కు ఎండ‌లు దంచికొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. 16 నుంచి 19వ తేదీ మ‌ధ్య‌లో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. అయితే ఈ వ‌ర్షాలు వేడి తీవ్ర‌త వ‌ల్లే వ‌చ్చే వ‌ర్షాలే కానీ, చెప్పుకోద‌గ్గ వ‌ర్షాలు కావ‌ని తెలిపారు. జూలై 19 త‌ర్వాత వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో మార్పులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని బాలాజీ పేర్కొన్నారు.

ఇక ఆదివారం ఖ‌మ్మం, సూర్యాపేట‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబాబాద్, ములుగు జిల్లాలో 40 డిగ్రీల వ‌ర‌కు ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. వ‌రంగ‌ల్, జ‌న‌గామ‌, యాదాద్రి భువ‌న‌గిరి, కరీంన‌గ‌ర్, హ‌నుమ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, నాగ‌ర్‌క‌ర్నూల్, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో 39 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో 35 నుంచి 38 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యాయి.

Advertisement
Advertisement