త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమ‌వుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల‌

Etala Rajendar | చుక్క నీరు నిల్వ చేయ‌కుండా న‌దిలో వృథాగా పోయే నీటిని ఎత్తిపోయాల‌ని చెబుతున్నామ‌ని.. అర్థం అవుతుందా రేవంత్‌రెడ్డి గారూ అని మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఫైర‌య్యారు. అన‌వ‌స‌ర‌ భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయాల‌ని సూచించారు.

S

Telangana | Published On Jul 10, 2026, 1.32 pm IST

Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమ‌వుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల‌
Advertisement
  • భేష‌జాలు బంజేసి ఉత్త‌మ్ ఉత్త‌మంగా ఆలోచ‌న చేయాలి
  • నీచుల‌కు నేన్ స‌మాధానం చెప్పాల్సిన ప‌ని లేదు
  • బ‌ద్నాం చేస్తే చేస్తిరి గానీ.. మేడిగ‌డ్డ‌లో ఉన్న నీళ్లు పంప్ చేయండి
  • బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌

Etala Rajendar | త్రినేత్ర‌.న్యూస్‌: చుక్క నీరు నిల్వ చేయ‌కుండా న‌దిలో వృథాగా పోయే నీటిని ఎత్తిపోయాల‌ని చెబుతున్నామ‌ని.. అర్థం అవుతుందా రేవంత్‌రెడ్డి గారూ అని మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఫైర‌య్యారు. అన‌వ‌స‌ర‌ భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయాల‌ని సూచించారు. తాను తెలంగాణ మ‌ట్టిబిడ్డ‌ను, ఉద్య‌మ‌కారున్నిన‌ని.. అదే నా గుర్తింపు అని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌ష్టం చేస్తే చూస్తూ ఊరుకోన‌ని.. చీల్చి చెండాడుతాన‌ని ఘాటుగా హెచ్చ‌రించారు.

ఎవ‌రి మెప్పు కోస‌మే మాట్లాడేవాళ్లం కాదు..

మేం స్వయం ప్రకాశితులం. ఎవరో మాట్లాడిస్తేనో.. స్క్రిప్ట్ రాసి ఇస్తేనో.. ఎవరి మెప్పు కోసమే మాట్లాడేవాళ్లం కాదు. అలా ఆరోపించే నీచులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదు. పని చేయాల్సిన వారిని అడుగుతున్నా. దేవాదులకు బ‌రాజ్ లేదు. లేకుండా నీళ్లు పంపు చేస్తున్నారు. మేడిగడ్డ లో నీళ్లు నింపమని అడగడం లేదు. ఉన్న నీళ్లను పంప్ చేయమని అడుగుతున్నా. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెడితే ఖబర్దార్ అని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

మన దేశం వ్యవసాయ దేశం.. మన ఆదాయం దాని మీద ఆధారపడి ఉంది. 60 శాతం ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. నీళ్లు ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పడతారు. భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయండి. చుక్క నీరు నిల్వ‌ చేయకండి. నదిలో పోయే నీటిని ఎత్తిపోయండి అని చెప్తున్నాం. అర్థం అవుతుందా రేవంత్ రెడ్డి గారు అని ఈట‌ల‌ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

కాళ్లేశ్వ‌రం అంటే మేడిగ‌డ్డ ఒక‌టే కాదు..

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని బద్నాం చేస్తే ప్రజలు హర్షించరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మాత్రమే కాదు. అన్నారం, సుందిళ్ల‌, రంగనాయ‌క్ సాగ‌ర్‌, మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ ఉన్న‌ది. మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు. ఏమ‌న్నా జ్ఞానం ఉందా? వంద‌ల టీఎంసీల నీరు, వంద‌ల కిలోమీట‌ర్ల పైపులైన్లు.. కాల్వ‌లు, ప‌దుల సంఖ్య‌లో టన్నెల్స్‌, పెద్ద పెద్ద ఎల‌క్ట్రిక్ ట‌వ‌ర్లు క‌లిగి ఉన్న‌ది. బ‌ద్నాం చేస్తే చేస్తివి గాని దీన్ని వాడుకోరాదు.. అని ఈటల వ్యంగాస్త్రాలు సంధించారు.

Advertisement
Advertisement