Vijaya Shanthi | తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఖండిస్తుందా? లేదా?: విజయశాంతి
Vijaya Shanthi | పాకిస్థాన్ (Pakistan) విభజన కన్నా ఘోరంగా తెలంగాణ (Telangana) రాష్ట్ర విభజన జరిగిందని కర్ణాటక బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా ఉన్నాయని ఎమ్మెల్సీ విజయశాంతి (Vijaya Shanthi) అన్నారు.
Vijaya Shanthi | త్రినేత్ర.న్యూస్: పాకిస్థాన్ (Pakistan) విభజన కన్నా ఘోరంగా తెలంగాణ (Telangana) రాష్ట్ర విభజన జరిగిందని కర్ణాటక బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా ఉన్నాయని ఎమ్మెల్సీ విజయశాంతి (Vijaya Shanthi) అన్నారు. తేజస్వీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఖండిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బాధ్యతారహిత కామెంట్స్ పుండుమీద కారంచల్లే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఓ వైపు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ తెలంగాణ సెంటిమెంట్ను కించపరుస్తూ పార్లమెంట్ వేదికగా మాట్లాడటం గర్హనీయమని చెప్పారు.
లోకసభ స్పీకర్ ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కోరాలన్నారు. అలా చేసి, ఈ తప్పును సరిదిద్దాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సూర్య తేజస్వి కామెంట్స్ను ఖండిండం మానేసి, ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణను సాధించగలరా అనే విధంగా టీబీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తాను, కేసీఆర్ పార్లమెంట్ లోపల, బయట తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేశామనే విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులను అడిగితే చెబుతారన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించడం వల్లే సోనియాగాంధీ పెద్దమనసుతో రాష్ట్ర విభజనకు అంగీకారించరాన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించకుండా.. సూర్య తేజస్వి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఖండిస్తోందా లేదా అనే ప్రశ్నకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా ఉన్నాయి. pic.twitter.com/B76psrrrP8
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 16, 2026
Read Also..
ఇది అవమానం.. మన పోరాటంపై దాడి.. గౌరవంపై గాయం: పొన్నం ప్రభాకర్
తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వం : కేటీఆర్
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



