త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemulawada | వేముల‌వాడ రాజ‌న్న‌కు భారీగా ఆదాయం..

Vemulawada | ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవ‌స్థానానికి భారీగా ఆదాయం స‌మ‌కూరింది. 28 రోజుల వ్య‌వ‌ధికి సంబంధించిన హుండీని లెక్కించ‌గా, రూ. 3.72 కోట్ల ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య ఈవో ర‌మాదేవి పేర్కొన్నారు.

S

Telangana | Published On Sep 18, 2026, 8.26 am IST

Vemulawada | వేముల‌వాడ రాజ‌న్న‌కు భారీగా ఆదాయం..
Advertisement

Vemulawada | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవ‌స్థానానికి భారీగా ఆదాయం స‌మ‌కూరింది. 28 రోజుల వ్య‌వ‌ధికి సంబంధించిన హుండీని లెక్కించ‌గా, రూ. 3.72 కోట్ల ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య ఈవో ర‌మాదేవి పేర్కొన్నారు. బుధ‌, గురువారాల్లో ఆల‌య ప్రాంగ‌ణంలో హుండీల లెక్కింపు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 17 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి రూ. 3,72,78,809 నగదుతో పాటు 201 గ్రాముల బంగారం, 16.6 కిలోల వెండి స‌మ‌కూరింద‌ని తెలిపారు. పవిత్రమైన శ్రావణ మాసంలో తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు నుండి కూడా వేలాది మంది భక్తులు త‌ర‌లివ‌చ్చార‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement