త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Road Accident | క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘోర ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

S

Telangana | Published On Sep 18, 2026, 7.38 am IST

Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్ : క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘోర ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క‌రీంన‌గ‌ర్ - వ‌రంగ‌ల్ హైవేపై తాడిక‌ల్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ఐదుగురు ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింద‌ని పోలీసులు తెలిపారు. దీంతో కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు స్పాట్‌లోనే చ‌నిపోయార‌ని పేర్కొన్నారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ‌గా, వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను ప‌ర్శి, సుధాక‌ర్, విశ్వేశ్వ‌ర్‌గా గుర్తించారు. గాయ‌ప‌డిన వారు నిజామాబాద్‌కు చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement