త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | వ‌న‌స్థ‌లిపురంలో పాల వ్యాపారిపై క‌త్తితో దాడి

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురంలో దారుణం జ‌రిగింది. యాక్టివాపై పాలు తీసుకెళ్తున్నభుజంగ‌రావుపై శివేంద‌ర్ సింగ్ క‌త్తితో దాడి చేశాడు. ఎన్జీవోస్ కాల‌నీ బ‌స్టాండ్ స‌మీపంలో దాడి జరిగింది.

S

Hyderabad | Published On Sep 18, 2026, 9.50 am IST

Hyderabad | వ‌న‌స్థ‌లిపురంలో పాల వ్యాపారిపై క‌త్తితో దాడి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురంలో దారుణం జ‌రిగింది. యాక్టివాపై పాలు తీసుకెళ్తున్నభుజంగ‌రావుపై శివేంద‌ర్ సింగ్ క‌త్తితో దాడి చేశాడు. ఎన్జీవోస్ కాల‌నీ బ‌స్టాండ్ స‌మీపంలో దాడి జరిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న భుజంగ‌రావును చికిత్స నిమిత్తం ఎల్బీన‌గ‌ర్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

గుర్రంగూడలో భుజంగరావు ఇంటి పక్కనే శివేందర్‌సింగ్‌ ఉంటున్నాడు. ఎన్జీవోస్ కాలనీలో భుజంగరావు పాల వ్యాపారం చేస్తుండగా, శివేందర్‌సింగ్‌ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో భుజంగరావుపై దాడి చేసిన శివేందర్‌సింగ్‌, అనంతరం వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement