Kishan Reddy | ఒకప్పుడు బీఐఎఫ్ఆర్ లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంది అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో రూ.684 కోట్ల అప్పుపై మారిటోరియం విధించి సింగరేణిని కాపాడారు.. తద్వారా సింగరేణి లాభాల బాటలో పడింది అని ఆయన పేర్కొన్నారు.