త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సరికొత్త‌ రికార్డు.. 12 రోజుల్లో ‘కోటి’ మంది ప్ర‌యాణం..!

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే స‌రికొత్త రికార్డు సృష్టించింది. సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో 12 రోజుల్లోనే కోటి మంది ప్ర‌యాణికుల‌ను వారి గ‌మ్య‌స్థానాల‌కు సుర‌క్షితంగా చేర్చింది.

S

National | Published On Jan 21, 2026, 7.10 pm IST

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సరికొత్త‌ రికార్డు.. 12 రోజుల్లో ‘కోటి’ మంది ప్ర‌యాణం..!
Advertisement

South Central Railway | త్రినేత్ర‌.న్యూస్ : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే స‌రికొత్త రికార్డు సృష్టించింది. సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో 12 రోజుల్లోనే కోటి మంది ప్ర‌యాణికుల‌ను వారి గ‌మ్య‌స్థానాల‌కు సుర‌క్షితంగా చేర్చింది. సంక్రాంతి ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే మొత్తం 209 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపింది.

జ‌న‌వ‌రి 7 నుంచి 18వ తేదీ వ‌ర‌కు సాధార‌ణ రైళ్ల‌తో పాటు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపారు. ఈ ప్ర‌త్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ‌, లింగంప‌ల్లి, చ‌ర్ల‌ప‌ల్లి, వికారాబాద్, తిరుప‌తి, తిరుచానూరు, నాందేడ్ స్టేష‌న్ల నుంచి న‌డిపించారు. ప్ర‌ధానంగా విజ‌య‌వాడ‌, కాకినాడ‌, అనకాప‌ల్లి, మ‌చిలీప‌ట్నం, న‌ర్సాపూర్, శ్రీకాకుళం, బెంగ‌ళూరుతో పాటు ప‌లు స్టేష‌న్ల‌ను క‌లుపుతూ ఈ ప్ర‌త్యేక రైళ్లు న‌డిచాయి. ఈ 12 రోజుల్లో దాదాపు కోటి మంది ప్ర‌యాణికులు ఈ ప్ర‌త్యేక రైళ్ల‌లో ప్ర‌యాణించారు. గ‌తేడాదితో పోల్చితే ఈసారి 10 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు రైళ్ల సేవ‌ల‌ను వినియోగించుకున్నారు.

సికింద్రాబాద్ స్టేష‌న్ నుంచి సాధార‌ణ రోజుల్లో 1.3 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తుంటారు. కానీ సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఒకేరోజు 2 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌యాణించి రికార్డు సృష్టించారు. కాచిగూడ స్టేష‌న్ నుంచి ఒకేరోజు 68,500 మంది ప్ర‌యాణించారు. సాధార‌ణ రోజుల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల సంఖ్య‌కు ఇది రెట్టింపు.

Advertisement

తాజావార్తలు

Advertisement