త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake Doctors | జోగిపేట ఏరియా ద‌వాఖాన‌లో న‌కిలీ డాక్ట‌ర్లు.. మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు

Fake Doctors | సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ద‌వాఖాన‌లో (Jogipet Area Hospital) న‌కిలీ డాక్ట‌ర్ల (Fake Doctors) వ్య‌వ‌హారం క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. హాస్పిట‌ల్‌లో సీనియ‌ర్ వైద్యులు విధుల‌కు హాజ‌రు కాకుండా త‌మ స్థానంలో మ‌రొక‌రిని డ్యూటీల‌కు పంపుతున్నారు.

G

Telangana | Published On Aug 14, 2026, 12.26 pm IST

Fake Doctors | జోగిపేట ఏరియా ద‌వాఖాన‌లో న‌కిలీ డాక్ట‌ర్లు.. మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు
Advertisement

Fake Doctors | త్రినేత్ర‌.న్యూస్‌: సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ద‌వాఖాన‌లో (Jogipet Area Hospital) న‌కిలీ డాక్ట‌ర్ల (Fake Doctors) వ్య‌వ‌హారం క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. హాస్పిట‌ల్‌లో సీనియ‌ర్ వైద్యులు విధుల‌కు హాజ‌రు కాకుండా త‌మ స్థానంలో మ‌రొక‌రిని డ్యూటీల‌కు పంపుతున్నారు. గ‌త వార‌మే ఓ వైద్యునిపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ‌గా, తాజాగా మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్ల‌పై (Doctors Suspended) అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు.

జోగిపేట ఏరియా ద‌వాఖాన డిప్యూటీ సివిల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ర‌మేశ్‌.. త‌న‌కు బ‌దులు ప్రైవేటు డెంట‌ల్ వైద్యుడు ర‌విని విధుల‌కు పంపుతూ ప‌ట్టుబడిన విష‌యం తెలిసిందే. దీంతో డాక్ట‌ర్ ర‌మేశ్‌పై వైద్య‌శాఖ అధికారులు ఈ నెల 7న‌ స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఇది జ‌రిగి స‌రిగ్గా వారం రోజుల్లోనే మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్లు ప‌ట్టుబ‌డ్డారు. డాక్టర్ శివశంకర్ రెడ్డి, డాక్టర్ తులజా భవాని త‌మ‌ స్థానంలో ప్రైవేటు వైద్యుల‌ను విధుల్లో ఉంచిన‌ట్లు విచార‌ణ‌లో గుర్తించారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు. వ‌రుస‌గా ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తుండ‌టంతో మంత్రి దామోద‌ర.. హాస్పిట‌ల్ సిబ్బందిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఫేక్ డాక్ట‌ర్ల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీచేశారు. జోగిపేట హాస్పిట‌ల్‌లో వైద్యుల విధుల నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ న‌మోదుచేసిన‌ జోగిపేట పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైద్యారోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఇలాఖాలోనే ఇలాంటి వ్య‌వ‌హారాలు వెలుగుచూస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement