త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAS Promotions | నవీన్ మిట్టల్, దానకిశోర్‌లకు పదోన్నతి

పదోన్నతలు తర్వాత వీళ్లు నిర్వహిస్తున్న విధులతో పాటు వాటిలో కొనసాగుతూనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కి నవీన్ మిట్టల్ అదనపు బాధ్యతలు చేపట్టనుండగా, దాన కిశోర్.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎల్ఈటీ అండ్ ఎఫ్ డిపార్ట్‌మెంట్‌కి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు

J

Telangana | Published On Dec 22, 2025, 8.18 pm IST

IAS Promotions | నవీన్ మిట్టల్, దానకిశోర్‌లకు పదోన్నతి
Advertisement

IAS Promotions | తెలంగాణ క్యాడర్‌కి చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. నవీన్ మిట్టల్, ఎం.దాన కిశోర్‌లను ఐఏఎస్ అపెక్స్ స్కేల్‌కి పదోన్నతి కల్పించారు. దీన్నే పే మ్యాట్రిక్స్ లేవల్ 17 అంటారు. ఈ ప్రమోషన్ జనవరి 1, 2026 నుంచి లేదా వాళ్లు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం నవీన్ మిట్టల్ ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాన కిశోర్ ఎల్ఈటీ అండ్ ఎఫ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. పదోన్నతలు తర్వాత వీళ్లు నిర్వహిస్తున్న విధులతో పాటు వాటిలో కొనసాగుతూనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కి నవీన్ మిట్టల్ అదనపు బాధ్యతలు చేపట్టనుండగా, దాన కిశోర్.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎల్ఈటీ అండ్ ఎఫ్ డిపార్ట్‌మెంట్‌కి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement