త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

భద్రాచలం-విశాఖపట్నం రోడ్డు కారిడార్ అభివృద్ధిపై రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు.

J

Telangana | Published On Aug 12, 2026, 7.53 pm IST

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
Advertisement
  • రాజ్యసభలో భద్రాచలం-విశాఖపట్నం రోడ్డు కారిడార్ అభివృద్ధిపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో (LWE) రోడ్ల కనెక్టివిటీ కోసం రూ. 2,170 కోట్లు, గిరిజన సబ్ ప్లాన్ కింద రూ. 1,711 కోట్లు మంజూరు
  • భద్రాచలం-చింతూరు మార్గాన్ని NH-30 ద్వారా ఇప్పటికే టూ-లేన్ (Two-lane) రహదారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి వెల్లడి
  • ఈ మార్గం సీలేరు, చింతపల్లి మీదుగా సిక్స్-లేన్ హైవే అయిన NH-16 (విశాఖపట్నం రూట్) కు అనుసంధానం కానున్నట్లు స్పష్టీకరణ

Bhadrachalam-Vizag Road Corridor | త్రినేత్ర.న్యూస్ : భద్రాచలం నుంచి విశాఖపట్నం (Bhadrachalam to Visakhapatnam) వెళ్లే ప్రయాణికులకు, వ్యాపారులకు గుడ్ న్యూస్. ఈ రెండు ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ సాగే రోడ్డు కారిడార్ అభివృద్ధిపై బుధవారం రాజ్యసభలో కీలక చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నేషనల్ హైవేల గుర్తింపు ఎలా?

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాష్ట్ర రహదారులను (State Highways) జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని తమకు తరచుగా ప్రతిపాదనలు వస్తుంటాయని గడ్కరీ తెలిపారు. అయితే, ట్రాఫిక్ డెన్సిటీ (Traffic density), వామపక్ష తీవ్రవాద (LWE), గిరిజన ప్రాంతాల కనెక్టివిటీ అవసరాలు, 'పీఎం గతి శక్తి' (PM Gati Shakti) మాస్టర్ ప్లాన్ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటామని ఆయన సభలో స్పష్టం చేశారు.

రూ. వేల కోట్లతో ప్రాజెక్టుల మంజూరు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం నిధులు కేటాయించింది. 'రోడ్ కనెక్టివిటీ స్కీమ్' కింద రూ. 2,170 కోట్లు, అలాగే గిరిజన సబ్ ప్లాన్ ద్వారా మరో రూ. 1,711 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా ఆర్థికాభివృద్ధి కూడా వేగవంతం అవుతుంది.

కారిడార్ కనెక్టివిటీ ఇలా..

భద్రాచలం - విశాఖపట్నం మార్గం గురించి మాట్లాడుతూ.. భద్రాచలం నుంచి చింతూరు వరకు NH-30 ద్వారా అనుసంధానం కల్పించామని గడ్కరీ చెప్పారు. ఈ రూట్‌ను ఇప్పటికే టూ-లేన్ (Two-lane) గా అభివృద్ధి చేశామన్నారు. అక్కడి నుంచి సీలేరు - చింతపల్లి - నర్సీపట్నం - తాళ్లపాలెం మీదుగా వెళ్లే స్టేట్ హైవే.. నేరుగా NH-16 ను కలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం మీదుగా వెళ్లే ఈ NH-16ని ఇప్పటికే సిక్స్-లేన్ (Six-lane) హైవేగా అప్‌గ్రేడ్ చేసినట్లు ఎంపీ వద్దిరాజుకు ఇచ్చిన సమాధానంలో మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Advertisement
Advertisement