Tiger | సిద్దిపేటలో పెద్ద పులి అలజడి.. ఒకే రోజు ఏడు మూగ జీవాలు బలి
Tiger | సిద్దిపేటలో ఓ పెద్ద పులి అలజడి సృష్టిస్తోంది. ఒకే రోజు ఏడు పశువులను పొట్టన పెట్టుకుంది. దీంతో సిద్దిపేట జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి సంచారంపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
Tiger | త్రినేత్ర.న్యూస్ : సిద్దిపేటలో ఓ పెద్ద పులి అలజడి సృష్టిస్తోంది. ఒకే రోజు ఏడు పశువులను పొట్టన పెట్టుకుంది. దీంతో సిద్దిపేట జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి సంచారంపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
నంగునూరు మండలంలోని ఘన్పూర్ గ్రామం, కోహెడ మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామాల్లో పులి సంచరిస్తూ.. ఇద్దరు రైతులకు చెందిన పశువులపై దాడి చేసి చంపింది. ఘన్పూర్ గ్రామంలో రెండు, ఆరేపల్లి గ్రామంలో మరో ఐదు పశువులను పులి హతమార్చింది.
అయితే పెద్ద పులి ఆదివారం తెల్లవారుజామున పశువులపై దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఆదివారం ఉదయం రైతులు తమ వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి చూడగా పశువులు చనిపోయి ఉండడాన్ని చూషి షాకయ్యారు. ఆరేపల్లి, ఘన్పూర్ గ్రామ శివార్లలో అటవీశాఖ అధికారులు నిఘా పెట్టారు. పెద్ద పులి కదలికలను గమనించేందుకు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ పెద్ద పులి సింగరాయ ప్రాజెక్టు సమీపంలోని అడవుల్లోకి వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అధికారులు డ్రోన్లను ఉపయోగించి స్థానిక అడవులను జల్లెడ పడుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి కదలికలను అధికారులు గమనించలేకపోయారు.
ఇక సమీప గ్రామాల్లోని పశువులను తమ నివాసాల వద్దే రైతులు కట్టేసుకుంటున్నారు. పొలాల వద్ద పశువులను ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు, ప్రజలు గుంపులు గుంపులుగా వ్యవసాయ పొలాలకు వద్దకు వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆడ తోడు కోసం మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పెద్ద పులి తిరిగి తన స్థానానికి వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత 20 రోజులుగా యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అలజడి సృష్టిస్తున్న పెద్ద పులి 12 ప్రాంతాల్లో పశువులపై దాడులకు పాల్పడి రక్తాన్ని కళ్లారా చూసింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



