త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chemical Leak | కర్ణాటక కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదం.. మృతుల్లో నారాయ‌ణ‌పేట వాసి..

Chemical Leak | క‌ర్ణాట‌క‌లోని (Karnataka) ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌మాదం జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున యాద్గిర్ (Yadgir) జిల్లాలోని క‌డేచూరు-బ‌డియాల్ పారిశ్రామ‌క‌వాడలో ఉన్న ఓ ప‌రిశ్ర‌మ‌లో ర‌సాయ‌న వాయువు లీక్ (Chemical Leak) అయింది.

G

Telangana | Published On Aug 5, 2026, 10.28 am IST

Chemical Leak | కర్ణాటక కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదం.. మృతుల్లో నారాయ‌ణ‌పేట వాసి..
Advertisement

Chemical Leak | త్రినేత్ర‌.న్యూస్‌: క‌ర్ణాట‌క‌లోని (Karnataka) ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌మాదం జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున యాద్గిర్ (Yadgir) జిల్లాలోని క‌డేచూరు-బ‌డియాల్ పారిశ్రామ‌క‌వాడలో ఉన్న ఓ ప‌రిశ్ర‌మ‌లో ర‌సాయ‌న వాయువు లీక్ (Chemical Leak) అయింది. దీంతో దానిని పీల్చ‌డంతో ఊపిరిఆడ‌క ముగ్గురు మృతిచెందారు. మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతుల్లో నారాయ‌ణ‌పేట జిల్లా కృష్ణ మండ‌లం ఆలంప‌ల్లికి చెందిన గ‌ణేశ్ అనే వ్య‌క్తి కూడా ఉన్నారు.

మిగిలిన ఇద్ద‌రిని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) కట్ని జిల్లాకు చెందిన విక్ర‌మ్‌, సంజ‌య్‌గా గుర్తించారు. మ‌ర‌ణించిన‌వారంతా 20 నుంచి 25 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కులేన‌ని పోలీసులు తెలిపారు. ప‌రిశ్ర‌మ యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యానికి కార్మికులు బ‌లవుతున్నార‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్ట‌రీలో క‌నీస మౌలిక వ‌స‌తులు కూడా లేవ‌ని చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపి బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ చ‌ర్య‌ల‌తో ప‌ర్య‌వ‌ర‌ణానికి హాని జ‌ర‌గ‌డంతోపాటు ప్ర‌జ‌ల ప్రాణాలు కూడా ప్ర‌మాదంలో ప‌డుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

 

Advertisement
Advertisement