త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | విచ‌క్ష‌ణ మ‌ర‌చిన తండ్రి.. నాలుగేండ్ల కుమారుడిని ఫుట్‌పాత్‌కేసి కొట్టాడు..

Hyderabad | ఆవేశంలో విచ‌క్ష‌ణ మ‌రిచిన తండ్రి త‌న‌ నాలుగేండ్ల కుమారుడిని ఫుట్‌పాత్‌కేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న హైద‌రాబాద్ (Hyderabad) గుడి మ‌ల్కాపూర్‌లో చోటుచేసుకుంది.

G

Hyderabad | Published On Aug 5, 2026, 9.48 am IST

Hyderabad | విచ‌క్ష‌ణ మ‌ర‌చిన తండ్రి.. నాలుగేండ్ల కుమారుడిని ఫుట్‌పాత్‌కేసి కొట్టాడు..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: ఆవేశంలో విచ‌క్ష‌ణ మ‌రిచిన తండ్రి త‌న‌ నాలుగేండ్ల కుమారుడిని ఫుట్‌పాత్‌కేసి (Footpath) కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న హైద‌రాబాద్ (Hyderabad) గుడి మ‌ల్కాపూర్‌లో చోటుచేసుకుంది.

గుడిమ‌ల్కాపూర్‌కు (Gudimalkapur) చెందిన స‌ల్మాన్ దంప‌తుల మ‌ధ్య‌ కొంత‌కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున కూడా భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం (Family Dispute) చోటుచేసుకుంది. దీంతో ఆగ్రాహానికి లోనైన స‌ల్మాన్ త‌న నాలుగేండ్ల కుమారుడు అర్మాన్‌ను నేల‌కేసి కొట్టాడు. దీంతో అత‌ని త‌ల ఫుట్‌పాత్‌కు బ‌లంగా తాక‌డంతో తీవ్ర‌గాయ‌మైంది. కుటుంబ స‌భ్యులు ఆ చిన్నార‌ని హుటాహుటిన ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement