V Hanumantha Rao | అభిజీత్ దీప్కేను బేదిరించడం మంచిది కాదు.. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తారట
V Hanumantha Rao | సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కేపై బీజేపీ నాయకులు బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ప్రశ్నించారు. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తామని బెదిరించడం అంత మంచిది కాదన్నారు. అయోధ్యలో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంటే ఒక్క స్వామి మాట్లాడడం లేదన్నారు.
- విద్యార్థుల పోరాటం వల్లే కేంద్రమంత్రి దిగిపోయారు
- అయోధ్య దోపిడీ మీద ఒక్క స్వామి మాట్లాడుతలేడు
- చినజీయర్స్వామితో పాటు అందరూ స్పందించాలి
- మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు డిమాండ్
V Hanumantha Rao | త్రినేత్ర.న్యూస్: సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కేపై బీజేపీ నాయకులు బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ప్రశ్నించారు. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తామని బెదిరించడం అంత మంచిది కాదన్నారు. అయోధ్యలో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంటే ఒక్క స్వామి మాట్లాడడం లేదన్నారు. చినజీయర్ స్వామితో పాటు అందరూ మాట్లాడాలని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల ఉద్యమంతోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు.
బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి..
బీజేపీ నాయకులు విద్యార్థుల ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేశారు. విద్యార్థులు గట్టిగా పోరాటం చేశారు కాబట్టే విద్య శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఉద్యమ సమయంలో విద్యార్థుల మీద పెట్టిన కేసులు మొత్తం ఎత్తేయాలి. పరీక్ష పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. హిందూ జపం చేస్తూ రాజకీయాలు చేస్తున్న బీజేపీ అయోధ్య గుడిలో విరాళాల దొంగతనంపై బీజేపీ మాట్లాడడం లేదు. అయోధ్య విషయంలో స్వాములు అందరూ స్పందించాలి. అక్కడ దొంగతనం చేసిన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలి అని హనుమంతరావు డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lal Darwaza Bonalu | లాల్దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా
జులై 31, 2026

Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం
జులై 31, 2026

CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో ‘పెద్ది’ పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్ రెడ్డి
జులై 31, 2026
తాజావార్తలు
- ●Lal Darwaza Bonalu | లాల్దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా మూడో రోజూ సూచీల జోరు..
- ●Jana Nayagan | కర్ణాటకలో జననాయగన్ స్క్రీనింగ్ నిలిపివేత - సీఎం దళపతి విజయ్ పోస్టర్లు చించేసిన ఆందోళనకారులు
- ●Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం
- ●Vande Bharat | వందేభారత్లో తొలిసారి గుండె తరలింపు
- ●OpenAI | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చాట్ జీపీటీలో వినియోగధరలు తగ్గింపు..

Lal Darwaza Bonalu | లాల్దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా మూడో రోజూ సూచీల జోరు..

Jana Nayagan | కర్ణాటకలో జననాయగన్ స్క్రీనింగ్ నిలిపివేత - సీఎం దళపతి విజయ్ పోస్టర్లు చించేసిన ఆందోళనకారులు

Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం



