త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఇదొక వ్య‌క్తి రాజీనామా కాదు.. అహంకార రాజ‌కీయాలు త‌ల‌వంచిన సంద‌ర్భం

Ponnam Prabhakar | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా ఒక వ్య‌క్తికి సంబంధించిన‌ది కాద‌ని.. విద్యార్థుల శ‌క్తి ముందు అహంకారపూరిత రాజ‌కీయాలు త‌ల‌వంచిన సంద‌ర్భ‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గద్దె దిగడానికి ప్రధాన్ రాజీనామా తొలి మెట్టులాంటిద‌న్నారు.

S

Telangana | Published On Jul 25, 2026, 3.30 pm IST

Ponnam Prabhakar | ఇదొక వ్య‌క్తి రాజీనామా కాదు.. అహంకార రాజ‌కీయాలు త‌ల‌వంచిన సంద‌ర్భం
Advertisement
  • బీజేపీ ప్ర‌భుత్వం గ‌ద్దె దిగ‌డానికి ఇదే తొలి మెట్టు
  • విద్యార్థులను అణ‌చివేసే ప్ర‌య‌త్నానికి ఇది గ‌ట్టి స‌మాధానం
  • మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వ్యాఖ్య‌లు

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా ఒక వ్య‌క్తికి సంబంధించిన‌ది కాద‌ని.. విద్యార్థుల శ‌క్తి ముందు అహంకారపూరిత రాజ‌కీయాలు త‌ల‌వంచిన సంద‌ర్భ‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గద్దె దిగడానికి ప్రధాన్ రాజీనామా తొలి మెట్టులాంటిద‌న్నారు. విద్యార్థుల ఉద్యమం, ప్రతిపక్షాల పోరాటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒత్తిడి కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చేసిన ప్రతి ప్రయత్నానికి ఈ పరిణామం గట్టి సమాధానమ‌ని స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు శ‌నివారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

ఐక్య పోరాటాల గెలుపిది..

రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును హరిస్తే ప్రజలు మరింత ఐక్యంగా పోరాడతారని కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా ఉన్న‌ విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయం. విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు, విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం చివరకు ప్రభుత్వానికే నష్టాన్ని మిగిల్చింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమం నిరూపించింది అని పొన్నం కొనియాడారు.

ఇంకా బ‌ల‌మైన పోరాటాన్ని కొన‌సాగిస్తం..

ఈ రాజీనామా దేశ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. విద్య, ఉపాధి, యువత భవిష్యత్తు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పూర్తిగా మార్చుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల హక్కులను రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు, యువజన సంఘాలకు, ప్రజాస్వామ్య శక్తులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి మరింత బలంగా పోరాటాన్ని కొనసాగిస్తాం అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement