త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Joginapally Santhosh Kumar | ఈ అంద‌మైన రోజు మాకు ఎంతో ప్ర‌త్యేకం.. ప‌చ్చ‌ని రేప‌టి కోసం మొక్క నాటుతున్నాం

Joginapally Santhosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న పెళ్లి రోజును పుర‌స్క‌రించుకుని స‌తీస‌మేతంగా ఒక మొక్కను నాటారు.

S

Telangana | Published On Aug 11, 2026, 4.03 pm IST

Joginapally Santhosh Kumar | ఈ అంద‌మైన రోజు మాకు ఎంతో ప్ర‌త్యేకం.. ప‌చ్చ‌ని రేప‌టి కోసం మొక్క నాటుతున్నాం
Advertisement
  • పెళ్లి రోజును పుర‌స్క‌రించుకొని స‌తీసమేతంగా మొక్క నాటిన సంతోష్‌కుమార్‌

Joginapally Santhosh Kumar | త్రినేత్ర‌.న్యూస్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంటూ ఆయన ఏటా తన పెళ్లి రోజున సతీసమేతంగా మొక్కలు నాటుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న పెళ్లి రోజును పుర‌స్క‌రించుకుని స‌తీస‌మేతంగా ఒక మొక్కను నాటారు. ఈమేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా త‌న సంతోషాన్ని పంచుకున్నారు.

త‌మ వివాహ వార్షికోత్సవం రోజున ఇద్దరం కలిసి మొక్క నాటడంతో ఈ అందమైన రోజును మరింత ప్రత్యేకం చేసిందన్నారు. త‌మ‌ ప్రేమ ప్రయాణం వర్ధిల్లుతున్న కొద్దీ, ఈ చిన్న మొక్క కూడా త‌మ‌తో పాటే ఎదుగుతూ.. రాబోయే తరాలకు నీడను, జీవాన్ని, ఆశను పంచాలని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌చ్చని రేపటి కోసం త‌మ‌ వంతు చిన్న ప్రయత్నం చేస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement
Advertisement