త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Session | మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు.. పంచాయతీరాజ్‌ నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ

Assembly Session | అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు (Assembly Session) మూడో రోజుకు చేరాయి. తొలి రోజు నుంచి అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, తోపులాట‌లు, స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల మ‌ధ్య స‌మావేశాలు సాగుతున్నాయి.

G

Telangana | Published On Sep 9, 2026, 7.30 am IST

Assembly Session | మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు.. పంచాయతీరాజ్‌ నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ
Advertisement

Assembly Session | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు (Assembly Session) మూడో రోజుకు చేరాయి. తొలి రోజు నుంచి అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, తోపులాట‌లు, స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల మ‌ధ్య స‌మావేశాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ (BRS) స‌భ్యుల అరెస్టు, స‌స్పెన్ష‌న్ వేటు, స్పీక‌ర్‌పై దూష‌న‌లు, మ‌హిళా స‌భ్యుల ప‌ట్ల‌ పోలీసుల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై ఉభ‌య స‌భ‌ల్లోనూ అధికార విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో రెండో రోజు స‌మావేశాలు వాయిదాలు.. నినాదాల న‌డుమ సాగాయి. బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు మూడో రోజు స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

పంచాయతీరాజ్​ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లును మంత్రి సీతక్క (Seethakka) సభలో ప్రవేశపెట్టనున్నారు. నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. ఇక మండ‌లిలో స్పీకర్​పై వ్యాఖ్యల వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. శనివారం కూడా శాసనసభ సమావేశాలు కొనసాగుతాయని సభ్యులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement