త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajendar | దూర‌మ‌వుతున్న స్నేహ‌, బంధుత్వాల‌ను ఈ ఉత్స‌వాలు ద‌గ్గ‌ర చేస్తాయి: ఈట‌ల రాజేంద‌ర్‌

Etala Rajendar | మాన‌వ సంబంధాల ప‌రిపుష్టిని గుర్తు చేసే గొప్ప పండ‌గ వినాయ‌క చ‌వితి అని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. బ్రిటిష్ పాల‌కుల‌ను ఎదిరించేందుకు బాల‌గంగాధ‌ర్ తిల‌క్ ఈ మండ‌పాల‌ను వేదిక‌గా మార్చుకున్నార‌ని గ‌ర్తుచేశారు.

S

Telangana | Published On Sep 14, 2026, 4.41 pm IST

Etala Rajendar | దూర‌మ‌వుతున్న స్నేహ‌, బంధుత్వాల‌ను ఈ ఉత్స‌వాలు ద‌గ్గ‌ర చేస్తాయి: ఈట‌ల రాజేంద‌ర్‌
Advertisement

Etala Rajendar | త్రినేత్ర‌.న్యూస్‌: మాన‌వ సంబంధాల ప‌రిపుష్టిని గుర్తు చేసే గొప్ప పండ‌గ వినాయ‌క చ‌వితి అని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. భార‌త జాతిని, హిందూ స‌మాజాన్ని ఒక్క‌టి చేయ‌డ‌మే వినాయ‌క ఉత్స‌వాల ఉద్దేశమ‌న్నారు. బ్రిటిష్ పాల‌కుల‌ను ఎదిరించేందుకు బాల‌గంగాధ‌ర్ తిల‌క్ ఈ మండ‌పాల‌ను వేదిక‌గా మార్చుకున్నార‌ని గ‌ర్తుచేశారు. గల్లీ గల్లీలో గణనాథుడిని ప్రతిష్టించి, అందరూ కలిసికట్టుగా ఉత్సవాలు నిర్వహించడం వల్ల ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయన్నారు. ఈమేర‌కు సోమ‌వారం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా పార్టీ ఆఫీసులో వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

ప్ర‌పంచంలోనే ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు క‌లిగిన దేశం భార‌త‌దేశం. ఈ దేశాన్ని ప‌రాయి పాలకులు క‌బ‌ళించిన్నాడు భార‌త జాతిని, హిందూ స‌మాజాన్నిఒక్క‌టి చేయాల‌న్నా ఆలోచ‌న‌తో మ‌న విశ్వాసాల‌ను, న‌మ్మ‌కాల‌ను స్వ‌తంత్ర సంగ్రామంలో మ‌లుచుకున్న‌దానికి స‌జీవ సాక్ష్య‌మే ఈరోజు జ‌రుపుతున్న గ‌ణేశుని ఉత్స‌వాల పండ‌గ. ఆనాడు బ్రిటిష్ పాల‌కులకు వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డంలో బాల‌గంగాధ‌ర్ తిల‌క్ గారు జాతి ఐక్యం చేయ‌డానికి మండ‌పాల‌ను వేదిక‌గా చేసుకున్న‌డు.

ఓవైపు మ‌న సంప్ర‌దాయం, మ‌రోవైపు సంఘ‌టిత శ‌క్తితోనే బ్రిటిష్ పాల‌కుల‌పై యుద్ధం చేసి స్వాతంత్య్రం సాధించుకున్నాం. మ‌హారాష్ట్ర‌లో బాల‌గంగాధ‌ర్‌తో మొద‌లైన ఆ ప‌రంప‌ర నేడు ప్ర‌తి ఇంటిలో పూజ‌లు నిర్వ‌హించుకుంటున్నాం. ప్ర‌తి గ‌ల్లీ నుంచి ప‌ట్టణం వ‌ర‌కు ఈరోజు ల‌క్ష‌ల మండ‌పాలు ఏర్పాటు చేస్తున్న‌రు. కోట్లాది మంది యువ‌త, మ‌హిళ‌లు ప్ర‌తి నిత్యం పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. దీంతో పాటు అన్న‌దానం, భ‌జ‌న‌లు నిర్వ‌హిస్తూ వ‌చ్చే త‌రాల‌కు కూడా మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల గొప్ప‌ద‌నం చెబుతున్నారు. మాన‌వ సంబంధాల ప‌రిపుష్టి ఏందో గుర్తు చేసే గొప్ప ఉత్స‌వంగా ఈ పండ‌గ‌ను చూస్తున్నం.

మ‌ళ్లీ ద‌గ్గ‌ర చేస్తాయి..

ఈరోజు హైద‌రాబాద్ ఉత్స‌వ గ‌ణేశ్ స‌మితి ఈ పండ‌గ‌ను గొప్ప‌గా నిర్వ‌హిస్తుంది. రోజువారీ బిజీ జీవితంలో దూరమవుతున్న బంధుత్వాలు, స్నేహాలను ఈ నవరాత్రి ఉత్సవాలు మళ్లీ దగ్గర చేస్తాయి. లంబోదరుడి పూజల్లో సమాజ శ్రేయస్సు, అందరి సంతోషం దాగి ఉంది. యువ‌త‌కు, మ‌హిళ‌ల‌కు, పండ‌గ‌లో పాలు పంచుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికి వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నా అని ఈటల పేర్కొన్నారు.

Advertisement
Advertisement