త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaleshwaram | ఘోష్ క‌మిష‌న్ నివేదిక ఆధారంగా ఇప్పుడే చ‌ర్య‌లొద్దు – హైకోర్టు ఆదేశం

Kaleshwaram | కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు నిర్మాణంపై విచార‌ణ జ‌రిపేందుకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ క‌మిష‌న్ (PC Ghosh Commission) నివేదిక ఆధారంగా ఇప్పుడే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు (High Court) ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

A

Telangana | Published On Jan 19, 2026, 3.51 pm IST

Kaleshwaram | ఘోష్ క‌మిష‌న్ నివేదిక ఆధారంగా ఇప్పుడే చ‌ర్య‌లొద్దు – హైకోర్టు ఆదేశం
Advertisement

Kaleshwaram | త్రినేత్ర‌.న్యూస్‌ : కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు నిర్మాణంపై విచార‌ణ జ‌రిపేందుకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ క‌మిష‌న్ (PC Ghosh Commission) నివేదిక ఆధారంగా ఇప్పుడే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు (High Court) ఆదేశించింది. క‌మిష‌న్ నివేదిక‌పై కేసీఆర్, హ‌రీశ్‌రావు, స్మితా స‌భ‌ర్వాల్‌, ఎస్‌కే జోషి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను అన్నంటినీ క‌లిపి హైకోర్టు విచారించింది. కేసీఆర్‌, హ‌రీశ్‌రావు త‌ర‌పున సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది సుంద‌రం వాద‌న‌లు వినిపించారు. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌భుత్వం కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌గా, దానికి పిటిష‌న‌ర్లు రిప్లై ఫైల్ చేశారు. దీనిపై ప్ర‌భుత్వం రిటెన్ స‌బ్మిష‌న్ ఇచ్చేందుకు స‌మ‌యం కావాల‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ కోరారు. దీనిపై వ‌చ్చే నెల 20లోపు లిఖిత‌పూర్వ‌క స‌బ్మిష‌న్ ఫైల్ చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల 25వ తేదీకి వాయిదా వేసింది. అప్ప‌టి వ‌ర‌కు క‌మిష‌న్ నివేదిక ఆధారంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని నిర్దేశించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement