త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | తెలంగాణ ముఖ్యమంత్రా? లేక ఫ్యాక్షన్ ముఠా నాయకుడా?: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

Dasoju Sravan Kumar | రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలంగాణ (Telangana) రాష్ట్రానికి ముఖ్య‌మంత్రా లేక ఫ్యాక్ష‌న్ ముఠా నాయ‌కుడా అని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్‌(Dasoju Sravan Kumar) మండిప‌డ్డారు. రేవంత్ అవలంబిస్తున్న అప్రజాస్వామిక ధోరణి, ఆయన వాడుతున్న అదుపులేని భాషపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

A

Telangana | Published On Jan 19, 2026, 4.15 pm IST

Dasoju Sravan Kumar | తెలంగాణ ముఖ్యమంత్రా? లేక ఫ్యాక్షన్ ముఠా నాయకుడా?: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Advertisement

Dasoju Sravan Kumar | త్రినేత్ర‌.న్యూస్‌ : రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలంగాణ (Telangana) రాష్ట్రానికి ముఖ్య‌మంత్రా లేక ఫ్యాక్ష‌న్ ముఠా నాయ‌కుడా అని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్‌(Dasoju Sravan Kumar) మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న అప్రజాస్వామిక ధోరణి, ఆయన వాడుతున్న అదుపులేని భాషపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి:
1. క్రిమినల్ కుట్ర - రౌడీ భాష
ముఖ్యమంత్రి హోదాలో ఉండి 'పాతిపెట్టండి', 'బొంద పెట్టండి', 'దిమ్మలు కూల్చండి' వంటి హింసాత్మక పదజాలం వాడటం చూస్తుంటే, మీరు ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదు, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ఒక పక్కా 'క్రిమినల్ కాన్‌స్పిరసీ' (నేరపూరిత కుట్ర) అని ఆయన ధ్వజమెత్తారు.
2. కాంగ్రెస్ జెండా.. టీడీపీ అజెండా
రేవంత్ రెడ్డి తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. "అధికారం కాంగ్రెసే కానీ, ఆత్మ మాత్రం టీడీపీదే" అని శ్రవణ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని, లోపల తన పాత యజమాని చంద్రబాబు నాయుడి అజెండాను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తన 'ప్లాన్-బి'లో భాగంగా టీడీపీని మళ్ళీ లేపేందుకు (Rise TDP) రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఇది ఒక రకమైన "రాజకీయ వ్యభిచారం" అని మండిపడ్డారు.
3. సొంత పార్టీ సీనియర్ల అణిచివేత
కాంగ్రెస్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారిని క్రమపద్ధతిలో బలహీనపరుస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఢిల్లీ అధిష్టానానికి పంగనామాలు పెడుతూ, ఇటు టీడీపీతో, అటు బీజేపీతో కోవర్ట్ సంబంధాలు నెరుపుతున్నారని విమర్శించారు.
4. ఆర్థిక అజ్ఞానం - డొల్ల వాగ్దానాలు
రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలవుతున్నా, సంపద సృష్టించే తెలివి లేక 'ఫ్యూచర్ సిటీ', '5 ట్రిలియన్ ఎకానమీ' అంటూ రేవంత్ ప్రజలకు రంగుల కలలు చూపిస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ఉండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.
5. కేసీఆర్ - తెలంగాణ జాతిపిత
తెలంగాణ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో 'తెలంగాణ జాతిపిత'గా ఎప్పటికీ నిలిచి ఉంటారని శ్రవణ్ స్పష్టం చేశారు. అటువంటి మహనీయుడిని, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీని తూలనాడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముగింపు: "అధికారం శాశ్వతం కాదు, మీ అహంకారమే మీ వినాశనానికి దారితీస్తుంది" అని హెచ్చరిస్తూ, రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని శ్రవణ్ దాసోజు హితవు పలికారు.

Advertisement

తాజావార్తలు

Advertisement