BRSLP | తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం
BRSLP | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ (Assembly) సమావేశాల నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల (Maze Farmers)కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కజొన్న కంకులతో గన్ పార్క్ (Gun Park) వద్ద నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు వెళ్తుండగా ప్రవేశద్వారం వద్దనే మార్షల్స్ అడ్డుకున్నారు.
మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
BRSLP | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ (Assembly) సమావేశాల నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల (Maze Farmers)కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కజొన్న కంకులతో గన్ పార్క్ (Gun Park) వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, తక్షణమే మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించాలని నినదించారు. అనంతరం అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు వెళ్తుండగా ప్రవేశద్వారం వద్దనే మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల చేతిలోని కంకులను లాక్కున్నారు. దాంతో మక్కలన్నీ కిందపడిపోయాయి. ఈ క్రమంలో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. మార్షల్స్కు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు హరీశ్రావు చేతికి స్వల్పగాయమైంది. ఆగ్రహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మార్షల్స్కి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రూ.1600, రూ.1700 ధరకే మొక్క జొన్న అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని వాపోయారు. మరో వైపు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఎందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. రెండు రోజులుగా పడుతున్న వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



