త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Wave | నేడు ఈ జిల్లాల్లో వ‌డ‌గాల్పులు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

Heat Wave | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి (Heat Wave). ఉద‌యం 8 గంట‌లకే సూర్యూడు మండిపోతున్నాడు. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతన్నాయి.

G

Telangana | Published On Apr 16, 2026, 6.36 am IST

Heat Wave | నేడు ఈ జిల్లాల్లో వ‌డ‌గాల్పులు.. ఎల్లో అల‌ర్ట్ జారీ
Advertisement

Heat Wave | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి (Heat Wave). ఉద‌యం 8 గంట‌లకే సూర్యూడు మండిపోతున్నాడు. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతన్నాయి. రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర‌ పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్ర‌వారాల్లో పలు జిల్లాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, మహాబూబ్‌ నగర్​తో పాటు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్‌ మల్కాజ్​గిరి, హైదరాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వ‌ర‌కు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మం జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్ల‌డించారు. అదేవిధంగా శుక్ర‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌తో పాటు నిజామాబాద్‌, ఖ‌మ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల‌ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేప‌థ్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాల‌ని అధికారులు సూచించారు. గొడుగు, టోపీ, తెల్లని రుమాలు ధరించాల‌న్నారు. తెల్లని నూలు వస్త్రాలు ధరించడం ఉత్తమమ‌ని, కూల్​ డ్రింక్స్​, మత్తు పానీయాల జోలికి వెళ్లకూడదన్నారు. నీరు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాల‌ని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement