Heat Wave | నిప్పుల కుంపటి.. రాష్ట్రంలో 39 డిగ్రీలు దాటిన ఎండలు
Heat Wave | రాష్ట్రంలో ఎండలు దంచి (Heat Wave) కొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యూడు నిప్పులు చిమ్ముతున్నాడు. సూర్యప్రతాపంతో అప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నది.
Heat Wave | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు దంచి (Heat Wave) కొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యూడు నిప్పులు చిమ్ముతున్నాడు. సూర్యప్రతాపంతో అప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9 డిగ్రీలు, మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత రికార్డయింది.
నేడు 6 జిల్లాల్లో 40 డిగ్రీలు..
కాగా, శుక్రవారం కూడా సూర్యుడు మండిపోతున్నాడని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 6 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 27 జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం పూట బయటి తిరగవద్దని, నీడపట్టున ఉండాలని, తగినంత నీరు తాగాలని పేర్కొంది. ఎండ తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో చల్లని ప్రాంతాల్లో సేదతీరాలని సూచించింది.
ఇవికూడా చదవండి..
రాష్ట్రానికి నూతన గవర్నర్.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్ వర్మ బదిలీ
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



