Heat Wave | నిప్పుల కుంపటి.. రాష్ట్రంలో 39 డిగ్రీలు దాటిన ఎండలు
Heat Wave | రాష్ట్రంలో ఎండలు దంచి (Heat Wave) కొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యూడు నిప్పులు చిమ్ముతున్నాడు. సూర్యప్రతాపంతో అప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నది.
Heat Wave | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు దంచి (Heat Wave) కొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యూడు నిప్పులు చిమ్ముతున్నాడు. సూర్యప్రతాపంతో అప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9 డిగ్రీలు, మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత రికార్డయింది.
నేడు 6 జిల్లాల్లో 40 డిగ్రీలు..
కాగా, శుక్రవారం కూడా సూర్యుడు మండిపోతున్నాడని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 6 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 27 జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం పూట బయటి తిరగవద్దని, నీడపట్టున ఉండాలని, తగినంత నీరు తాగాలని పేర్కొంది. ఎండ తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో చల్లని ప్రాంతాల్లో సేదతీరాలని సూచించింది.
ఇవికూడా చదవండి..
రాష్ట్రానికి నూతన గవర్నర్.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్ వర్మ బదిలీ
సంబంధిత వార్తలు

Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
జులై 7, 2026

Revanth Reddy | రేవంత్ కీలక నిర్ణయం.. సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
జులై 7, 2026

Concrete mixer operators protest | కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్ల ఆందోళన.. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జులై 7, 2026
తాజావార్తలు
- ●KUDA | 'కుడా'లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండర్లు రద్దు చేయాల్సిందే
- ●Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
- ●PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..
- ●PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ
- ●Revanth Reddy | రేవంత్ కీలక నిర్ణయం.. సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
- ●Concrete mixer operators protest | కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్ల ఆందోళన.. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

KUDA | 'కుడా'లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండర్లు రద్దు చేయాల్సిందే

Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు

PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..

PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ



