త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | డీలిమిటేషన్ అయితే 50 సీట్లు మహిళ‌ల‌కే : పీసీసీ చీఫ్

Mahesh Goud | హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తొలి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జ‌రిగింది. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డీలిమిటేష‌న్ జ‌రిగితే.. 40 నుంచి 50 సీట్లు మ‌హిళ‌ల‌కే కేటాయిస్తామ‌న్నారు.

P

Telangana | Published On Mar 23, 2026, 8.37 pm IST

Mahesh Goud | డీలిమిటేషన్ అయితే 50 సీట్లు మహిళ‌ల‌కే : పీసీసీ చీఫ్
Advertisement

Mahesh Goud | హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తొలి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జ‌రిగింది. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డీలిమిటేష‌న్ జ‌రిగితే.. 40 నుంచి 50 సీట్లు మ‌హిళ‌ల‌కే కేటాయిస్తామ‌న్నారు. పార్టీ అన్ని విభాగాలను బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వాన్ని, యువతను ప్రోత్సహించడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు నలుగురు నుండి ఐదుగురిని నామినేటెడ్ పదవులలో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్‌లో నాయకులు మర్యాదలు పాటిస్తూ వ్యవహరించాలన్నారు.

పార్టీ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ, మహిళల సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు. “మహిళలు ప్రపంచ జనాభాలో సగం. మన హక్కుల కోసం మనం పోరాడాలి. పార్టీ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం” అని పిలుపునిచ్చారు. అమరావతి ప్రాంతంలో నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తామని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సస్పెన్షన్ వర్తిస్తుందని హెచ్చరించారు. త్వరలో క్రమశిక్షణ కమిటీ, ఆఫీస్ ఇంచార్జి మరియు స్పోక్స్ పర్సన్ నియామకాలు జరుగుతాయని, జిల్లా పర్యటన వివరాలను త్వరలో తెలియజేస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement