త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Rythu Bharosa 2026 | రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్: సభా వేదిక మార్పు.. అకౌంట్లలో డబ్బులు పడేది అక్కడి నుంచే!

రేపు విడుదల కానున్న రైతు భరోసా నిధుల పంపిణీ సభ వేదికను వాతావరణం అనుకూలించని కారణంగా ప్రభుత్వం మార్చింది. కొత్త వేదిక, నిధుల జమ వివరాలు ఇవే.

J

Telangana | Published On Jun 29, 2026, 3.58 pm IST

Telangana Rythu Bharosa 2026 | రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్: సభా వేదిక మార్పు.. అకౌంట్లలో డబ్బులు పడేది అక్కడి నుంచే!
Advertisement
  • ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన రైతు భరోసా బహిరంగ సభ భారీ వర్షాల కారణంగా రద్దు
  • జూన్ 30న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి రైతుల ఖాతాల్లో నిధుల జమ
  • వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ. 6,000 చొప్పున డీబీటీ (DBT) ద్వారా నిధుల విడుదల
  • ఈ పథకంలో పేర్లు లేని అర్హులైన రైతులు కొత్తగా అప్లై చేసుకునేందుకు జూలై 5 వరకు గడువు పెంపు

Telangana Rythu Bharosa 2026 | త్రినేత్ర.న్యూస్ : వానాకాలం సీజన్‌ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ 30న జరగాల్సిన 'రైతు భరోసా' నిధుల పంపిణీ సభా వేదికను అనూహ్యంగా మార్చింది. ముందుగా నిర్ణయించిన ఖమ్మం జిల్లా మధిర సభను రద్దు చేసి.. ఆ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు (Shilpakala Vedika) మార్చుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

మధిర సభ రద్దుకు కారణమిదే

తొలుత ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానిలో 'రైతు ఆశీర్వాద సభ'ను భారీ ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. కానీ, గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడ వాతావరణం అనుకూలించలేదు. సభను కొనసాగిస్తే రైతులు, ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేసి హైదరాబాద్ కేంద్రంగా నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనివల్ల రైతులకు పెట్టుబడి సాయం అందడంలో ఎలాంటి అంతరాయం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎకరాకు రూ. 6,000.. నేరుగా అకౌంట్లోకి

జూన్ 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని జమ చేస్తారు. అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 6,000 చొప్పున నిధులు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు తమ తమ గ్రామాల్లోని 'రైతు వేదికల' నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సులో లైవ్‌లో పార్టిసిపేట్ చేయనున్నారు.

కొత్త దరఖాస్తులకు జూలై 5 లాస్ట్ డేట్

ఈ పథకానికి సంబంధించి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రైతు భరోసా మార్గదర్శకాలపై కసరత్తు చేసిన సర్కార్.. అర్హత ఉండి కూడా ఇంతవరకు పథకంలో లబ్ధిదారులుగా లేని వారికి మరో ఛాన్స్ ఇచ్చింది. అటువంటి వారు కొత్తగా అప్లై చేసుకోవడానికి జూలై 5వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి, ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం అర్హులైన వారందరికీ కచ్చితంగా రైతు భరోసా సాయం అందజేస్తారు.

Advertisement
Advertisement