త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Rising 2047 | రేపే తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్

Telangana Rising 2047 | హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ( Future City )లో ఈ నెల 8, 9 తేదీల్లో జ‌రగ‌బోయే తెలంగాణ రైజింగ్ -2047 గ్లోబ‌ల్ స‌మ్మిట్‌( Telangana Rising 2047 Global Summit ) కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

S

Telangana | Published On Dec 7, 2025, 5.27 pm IST

Telangana Rising 2047 | రేపే తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్
Advertisement

Telangana Rising 2047 | హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ( Future City )లో ఈ నెల 8, 9 తేదీల్లో జ‌రగ‌బోయే తెలంగాణ రైజింగ్ -2047 గ్లోబ‌ల్ స‌మ్మిట్‌( Telangana Rising 2047 Global Summit ) కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు 44 దేశాల ప్ర‌తినిధులు త‌ర‌లిరానున్నారు. రూ. ల‌క్ష‌ల కోట్ల ఒప్పందాలు జ‌ర‌గ‌నున్నాయి. అంతేకాకుండా 3 వేల మంది టాప్ కంపెనీల సీఈవోలు హాజ‌రు కానున్నారు.

2047 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) విలువను $3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడం ఈ స‌ద‌స్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది భారతదేశం యొక్క అంచనా జీడీపీలో దాదాపు 10% వాటాకు సమానం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ప్రభుత్వం 'టీఎస్ వృద్ధి దార్శనిక పత్రం' (TS Growth White Paper) ను ఈ సమ్మిట్‌లో ఆవిష్కరించనుంది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి నికర సున్నా ఉద్గారాలు (Net-Zero Emissions) కలిగిన రాష్ట్రంగా మార్చడంతో పాటు రాష్ట్రంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది ఈ స‌దస్సు ప్రధాన లక్ష్యం.

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేశారు. న‌గ‌రంలోని చారిత్రాక క‌ట్ట‌డాల‌తో పాటు స‌చివాల‌యాన్ని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా తీర్చిదిద్దారు. న‌గ‌రానికి వ‌చ్చే జాతీయ‌, అంత‌ర్జాతీయ అతిథుల‌కు తెలంగాణ సాంస్కృతిక వైభ‌వాన్ని చూపించే విధంగా ప‌లు ప్రాంతాల‌ను తీర్చిదిద్దారు. హుస్సేన్ సాగ‌ర్‌లో వాట‌ర్ ప్రొజెక్ష‌న్ ద్వారా భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, మ‌హిళా సాధికార‌త‌, యువ‌త - రైతు ప్ర‌ధాన కార్య‌క్ర‌మాలు, 3 ట్రిలియ‌న్ ఎకాన‌మీ ల‌క్ష్యం వంటి ముఖ్య అంశాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement