Inter Practical Exams | జంబ్లింగ్ విధానంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు..!
Inter Practical Exams | ఇంటర్ విద్యార్థులకు ఇది కాస్త చేదు వార్తే. గతేడాది వరకు ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈ సారి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తుంది.
Inter Practical Exams | హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు ఇది కాస్త చేదు వార్తే. గతేడాది వరకు ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈ సారి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తుంది.
జంబ్లింగ్ విధానం అంటే..?
ఇంటర్ విద్యార్థులకు 2026 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అయితే ఈ సారి కొత్తగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఒక కాలేజీ విద్యార్థులకు మరో కళాశాల కేటాయించి అక్కడ పరీక్షలు నిర్వహించడం.
ఇంటర్ బోర్డు ఈ కొత్త విధానాన్ని మొదటగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ల్యాబ్ సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించనున్నారు. అన్ని రకాల పరికరాలు ఉన్న ల్యాబ్లను త్వరలోనే గుర్తించి, వాటిని పరీక్షా కేంద్రాలుగా కేటాయించనున్నట్లు సమాచారం.
జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సదరు పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్లకు కూడా వీటిని విస్తరించనున్నారు. వీటన్నింటిని హైదరాబాద్ నగరంలోని ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. బోర్డు అధికారులు ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షిస్తూ.. మాల్ ప్రాక్టీస్తో పాటు ఇతర తప్పిదాలను కంట్రోల్ చేయనున్నారు.
ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఆదివారాల్లోనూ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఇక ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ను జనవరి 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. జనవరి 23, 24 తేదీల్లో ఎథిక్స్, హ్యుమన్ వాల్యూస్ ఎగ్జామ్ను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలు కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



