త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Health Department | రాబోయే ఏడు రోజులు వ‌ర్షాలు.. ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్తం

Health Department | రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఏడు రోజుల పాటు మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

S

Telangana | Published On Aug 23, 2026, 7.23 pm IST

Health Department | రాబోయే ఏడు రోజులు వ‌ర్షాలు.. ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్తం
Advertisement

Health Department | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఏడు రోజుల పాటు మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యారోగ్య శాఖ సూచించింది. సీజ‌నల్ వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉన్నందున జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

వైద్యారోగ్య శాఖ సూచ‌న‌లివే..

  • ప్ర‌తి ఒక్క‌రూ కూడా త‌మ నివాసాన్ని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డంతో పాటు త‌లుపుల‌కు, కిటికీల‌కు దోమ తెర‌ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు.
  • ఇంటి ప‌రిస‌రాల్లో వ‌ర్ష‌పు నీరు, మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాల‌న్నారు.
  • డొమెస్టిక్ సెప్టిక్ ట్యాంకుల వ‌ద్ద దోమ‌ల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
  • ప్ర‌తి శుక్ర‌వారం డ్రై డేగా ప‌రిగ‌ణించాల‌న్నారు.
  • ఇక కుటుంబ స‌భ్యులంద‌రూ కూడా ఫిల్ట‌ర్ చేసిన నీటిని లేదా వేడి చేసిన నీళ్ల‌ను తాగాల‌ని సూచించారు.
  • ఆహారం తినే ముందు చేతుల‌ను ప‌రిశుభ్రంగా క‌డుక్కోవాలి.
  • బ‌య‌టి ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి.
  • ద‌గ్గు, జ‌లుబుతో బాధ‌ప‌డేవారు ఇత‌రుల‌కు దూరంగా ఉండాలి.
  • జ్వ‌రం, జ‌లుబు, త‌ల‌నొప్పి, గొంతు నొప్పితో బాధ‌ప‌డేవారు త‌క్ష‌ణ‌మే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి.
Advertisement
Advertisement