త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం

ముంబై భులేశ్వర్‌లో విషాదం చోటుచేసుకుంది. 22 అడుగుల గణనాథుని విగ్రహం ఊరేగింపులో అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.

J

Crime | Published On Aug 23, 2026, 6.29 pm IST

Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం

సంక్షిప్త సారాంశం

ముంబై భులేశ్వర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఊరేగింపులో 22 అడుగుల భారీ గణేష్ విగ్రహం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గణపతి మండల్ ప్రెసిడెంట్ సంకేత్ నెవశేతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు చిన్నారులు సహా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐరన్ ఫ్రేమ్ వెల్డింగ్ సరిగ్గా లేకపోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ఫైర్ సిబ్బంది అంచనా.

Advertisement

Mumbai Ganpati Idol Collapse | త్రినేత్ర.న్యూస్ : పండుగ వాతావరణంలో ఎంతో కోలాహలంగా జరగాల్సిన వినాయక ఊరేగింపు ముంబైలో తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి సౌత్ ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో భారీ గణేష్ విగ్రహం అకస్మాత్తుగా జనం మీదకు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు పిల్లలు సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గమ్యానికి 50 మీటర్ల దూరంలో..

ముంబైలో అత్యంత పాపులర్ అయిన 'భులేశ్వర్ కా రాజా' (Bhuleshwar-cha-Raja) మండపానికి చెందిన 22 అడుగుల విగ్రహాన్ని శనివారం రాత్రి 10 గంటల సమయంలో 'ఆగమన్' ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. లాల్‌బాగ్ నుంచి ఫనాస్ వాడి వైపు వెళ్తుండగా, జై అంబే చౌక్ వద్దకు రాగానే విగ్రహం బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా పక్కకు వాలిపోయింది. గమ్యస్థానానికి కేవలం 50 మీటర్ల దూరంలో ఈ ఘోరం జరగడం అందరినీ కలచివేసింది.

మండల్ ప్రెసిడెంట్ మృతి

ఈ ప్రమాదంలో ఆ గణపతి మండల్ ప్రెసిడెంట్ సంకేత్ నెవశే (33), అలాగే బ్రిజేష్ హేమంత్ జోషి (38) ప్రాణాలు కోల్పోయారు. భారీ స్ట్రక్చర్, విగ్రహం భాగాలు నేరుగా వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై మరణించారు. గాయపడిన వారిలో వైభవ్ (38), పవన్ (25), కునాల్ (26)తో పాటు ఐదేళ్ల లావణ్య, ఏడేళ్ల దివ్య ఉన్నారు. వీరిని వెంటనే రిలయన్స్, జీటీ (GT), జేజే (JJ) ఆసుపత్రులకు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా సేఫ్‌గా ఉన్నట్లు సమాచారం.

కారణం ఏంటంటే?

విగ్రహాన్ని ఉంచిన ట్రాలీ ఐరన్ ఫ్రేమ్ వెల్డింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే బరువు తట్టుకోలేక మధ్యకు విరిగిపోయిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పైనుంచి కింద పడటంతో మూడు ముక్కలైన ఆ విగ్రహాన్ని ఆ తర్వాత నేరుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. డీబీ మార్గ్ (DB Marg) పోలీసులు ఈ ఘటనపై యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement